News April 24, 2024

పది ఫలితాలు.. బాలికలదే పైచేయి

image

AP: పదో తరగతి ఫలితాల్లో 86.69% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. బాలికలు 89.17%, బాలురు 84.32% మంది పాసైనట్లు చెప్పారు. సబ్జెక్టులవారీగా ఫస్ట్ లాంగ్వేజ్‌లో 96.47%, సెకండ్ లాంగ్వేజ్ 99.24%, థర్డ్ లాంగ్వేజ్ 98.52%, మ్యాథ్స్ 93.33%, జనరల్ సైన్స్ 91.296%, సోషల్ స్టడీస్‌లో 95.34శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు.
* WAY2NEWSలో రిజల్ట్స్ చెక్ చేసుకోండి.

Similar News

News March 22, 2026

కొబ్బరి రేట్లు ఢమాల్

image

AP: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం అనేక రంగాలపై పడుతోంది. ఈ జాబితాలో కొబ్బరి కూడా చేరింది. నెల వ్యవధిలోనే వెయ్యి కాయల ధర ₹22K నుంచి ₹12K-13Kకు పడిపోయింది. రాష్ట్రంలో 2.7L ఎకరాల్లో కొబ్బరి సాగువుతుంది. ఇతర రాష్ట్రాల కొబ్బరిని గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. యుద్ధం వల్ల ఎక్స్‌పోర్ట్స్ నిలిచిపోవడంతో ఆ కొబ్బరిని దేశీయంగా వినియోగిస్తున్నారు. దీంతో మన కొబ్బరికి గిరాకీ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.

News March 22, 2026

TDR పాలసీలో కీలక మార్పులు

image

TG: భవన నిర్మాణాల్లో ట్రాన్స్‌ఫరేబుల్ డెవలప్‌మెంట్ రైట్స్(TDR) వినియోగానికి సంబంధించి ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. 21mకు పైబడిన భవనాలను హై-రైజ్ భవనాలుగా గుర్తించనుంది. 750-2000చ.మీ ప్లాట్లలో 18-21m భవనాలకు TDR తప్పనిసరి చేసింది. నాన్ హై రైజ్ బిల్డింగ్స్‌కు సెట్ బ్యాక్ సడలించింది. హై రైజ్ భవనాల్లో 10% వరకు సెట్ బ్యాక్ రిలాక్షేషన్‌కు, 2000 చ.మీ ప్లాట్లలో అదనపు అంతస్తులకు అవకాశం కల్పించింది.

News March 22, 2026

జనసేన MLA బాలరాజుకు రూ.12లక్షలు టోకరా

image

AP: పోలవరం జనసేన MLA చిర్రి బాలరాజుకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఆర్టీఏ చలానా పేరుతో ఓ లింక్ పంపారు. దాన్ని క్లిక్ చేయగానే ఆయన ఖాతా నుంచి రూ.12లక్షలను మాయం చేశారు. మోసపోయినట్లు గుర్తించిన MLA వెంటనే జీలుగుమల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక SMలో షేర్ అయ్యే APK ఫైళ్లు, లింక్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఇప్పటికే హెచ్చరించారు.