News April 24, 2024
వినియోగదారులకు జొమాటో షాక్!
ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కస్టమర్స్కు షాక్ ఇచ్చింది. ఈ నెల 20 నుంచి ప్లాట్ఫామ్ ఫీజుగా ప్రతి ఆర్డర్పై రూ.5 అదనంగా వసూలు చేయడం ప్రారంభించింది. దేశంలోని ప్రధాన మార్కెట్లలో ఇది మొదలైంది. మరో డెలివరీ యాప్ స్విగ్గీ కూడా ఇప్పటికే ప్లాట్ఫామ్ ఫీజు పేరిట రూ.5 విధిస్తోంది. ఇక నగరాల మధ్య చేపట్టే ‘ఇంటర్సీటీ’ ఫుడ్ డెలివరీని ఆపేస్తున్నట్లు జొమాటో ప్రకటించింది. న్యాయపరమైన సమస్యలే దీనికి కారణమని తెలిపింది.
Similar News
News October 15, 2024
కొండా సురేఖ ఫొటో మార్ఫింగ్.. ఇద్దరి అరెస్ట్
TG: మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు <<14234406>>ఫొటో మార్ఫింగ్ కేసులో<<>> ఇద్దరిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సురేఖ, రఘునందన్ ఎడిటెడ్ ఫొటోలు వైరల్ కావడంతో జరిగిన పరిణామాలు రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎంపీ ఫిర్యాదుతో నిజామాబాద్, జగిత్యాలకు చెందిన దేవన్న, మహేశ్లను అరెస్ట్ చేశారు.
News October 15, 2024
GREAT: తండ్రిని చంపిన హంతకుడిని పట్టుకునేందుకు పోలీస్గా మారింది
సినిమా స్టోరీని తలదన్నేలా తన తండ్రిని చంపిన వ్యక్తిని శిక్షించడం కోసం ఓ మహిళ పోలీస్గా మారిన ఘటన బ్రెజిల్లో జరిగింది. గిస్లేనే సిల్వా(35) అనే మహిళ తండ్రి జోస్ విసెంటేను 1999లో స్నేహితుడు రైముండే హత్య చేశాడు. 2013లో శిక్ష పడినా తప్పించుకున్నాడు. ఈ పరిణామాలు చూస్తూ పెరిగిన సిల్వా లా చదివారు. తర్వాత పోలీసుగా మారారు. ఇటీవల నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపగా, కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
News October 15, 2024
EVMల బ్యాటరీ కాలిక్యులేటర్ బ్యాటరీ లాంటిది: CEC
EVMల బ్యాటరీ కాలిక్యులేటర్ల బ్యాటరీ లాంటిదని CEC రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. లెబనాన్కు చెందిన హెజ్బొల్లా పేజర్లను ఇజ్రాయెల్ పేల్చగలిగినప్పుడు, మన EVMల పరిస్థితేంటని కాంగ్రెస్ ప్రశ్నించడంపై ఆయన స్పందించారు. ఈవీఎంలలో కాలిక్యులేటర్ లాంటి సింగిల్ యూజ్ బ్యాటరీ ఉంటుందని, అది మొబైల్ బ్యాటరీ కాదని పేర్కొన్నారు. ఈవీఎంల బ్యాటరీలకు మూడంచెల రక్షణ వ్యవస్థ ఉంటుందని వివరించారు.