News April 24, 2024

అయోధ్యను 1.5కోట్ల మంది సందర్శించారు: ట్రస్ట్

image

జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి అయోధ్య రామమందిరాన్ని 1.5కోట్ల సందర్శించారని రామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడించింది. ప్రతి రోజు సుమారు లక్షమందికి పైగా భక్తులు బాలరాముడిని దర్శించుకున్నట్టు తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆలయ ప్రారంభోత్సవానికి దేశ నలుమూలల నుంచి ప్రముఖులు హాజరయ్యారు.

Similar News

News October 15, 2024

కొండా సురేఖ ఫొటో మార్ఫింగ్.. ఇద్దరి అరెస్ట్

image

TG: మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు <<14234406>>ఫొటో మార్ఫింగ్ కేసులో<<>> ఇద్దరిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సురేఖ, రఘునందన్ ఎడిటెడ్ ఫొటోలు వైరల్ కావడంతో జరిగిన పరిణామాలు రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎంపీ ఫిర్యాదుతో నిజామాబాద్, జగిత్యాలకు చెందిన దేవన్న, మహేశ్‌లను అరెస్ట్ చేశారు.

News October 15, 2024

GREAT: తండ్రిని చంపిన హంతకుడిని పట్టుకునేందుకు పోలీస్‌గా మారింది

image

సినిమా స్టోరీని తలదన్నేలా తన తండ్రిని చంపిన వ్యక్తిని శిక్షించడం కోసం ఓ మహిళ పోలీస్‌గా మారిన ఘటన బ్రెజిల్‌లో జరిగింది. గిస్లేనే సిల్వా(35) అనే మహిళ తండ్రి జోస్ విసెంటేను 1999లో స్నేహితుడు రైముండే హత్య చేశాడు. 2013లో శిక్ష పడినా తప్పించుకున్నాడు. ఈ పరిణామాలు చూస్తూ పెరిగిన సిల్వా లా చదివారు. తర్వాత పోలీసుగా మారారు. ఇటీవల నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపగా, కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

News October 15, 2024

EVMల బ్యాట‌రీ కాలిక్యులేట‌ర్ బ్యాట‌రీ లాంటిది: CEC

image

EVMల బ్యాట‌రీ కాలిక్యులేట‌ర్ల‌ బ్యాట‌రీ లాంటిద‌ని CEC రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. లెబ‌నాన్‌కు చెందిన హెజ్బొల్లా పేజర్ల‌ను ఇజ్రాయెల్ పేల్చ‌గ‌లిగిన‌ప్పుడు, మ‌న EVMల ప‌రిస్థితేంట‌ని కాంగ్రెస్ ప్రశ్నించడంపై ఆయన స్పందించారు. ఈవీఎంల‌లో కాలిక్యులేట‌ర్ లాంటి సింగిల్ యూజ్ బ్యాట‌రీ ఉంటుందని, అది మొబైల్ బ్యాట‌రీ కాద‌ని పేర్కొన్నారు. ఈవీఎంల బ్యాట‌రీల‌కు మూడంచెల ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ ఉంటుంద‌ని వివరించారు.