News April 24, 2024

ఆ ఇద్దరికీ బుద్ధి చెప్పాలి: కేటీఆర్

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఓట్లతో బుద్ధి చెప్పాలన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో చేవెళ్లలోని రాజేంద్రనగర్‌లో ఆయన మాట్లాడారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయే పిరికిపందలకు బుద్ధి చెప్పాలని పార్టీ నేతలను కోరారు. BRSకు 8-10 సీట్లు ఇస్తే కేంద్రంలోని ప్రభుత్వం తాము చెప్పినట్లే వింటుందన్నారు.

Similar News

News February 5, 2025

NTR: APSFLలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల

image

విజయవాడలోని ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్(APSFL) కార్యాలయం నుంచి 2 పోస్టుల భర్తీకి బుధవారం ప్రకటన విడుదలైంది. ఈ మేరకు APFSL పరిధిలో ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ సీఈఓ, APFSLలో PRO పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలకు https://apsfl.in/careers.php అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చని, అభ్యర్థులు తమ దరఖాస్తులను apsfl@ap.gov.in మెయిల్ ద్వారా పంపాలని APFSL అధికారులు పేర్కొన్నారు.

News February 5, 2025

రాష్ట్రంలో ఠారెత్తిస్తున్న ఎండలు

image

TG: రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో 32 నుంచి 36 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతూ వేసవిని తలపిస్తోంది. వాతావరణంలో తేమశాతం తగ్గడంతో ఎండలు కాస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో వారంపాటు ఇవే ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా వేసింది. మరోవైపు హైదరాబాద్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. మీ ఏరియాలో ఎండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News February 5, 2025

Way2Newsలో ఎక్స్‌క్లూజివ్‌గా ఎగ్జిట్ పోల్స్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కానున్నాయి. ఢిల్లీ పీఠం ఎవరిదనే దానిపై యాక్సిస్ మై ఇండియా, సీ ఓటర్, జన్ కీ బాత్, టుడేస్ చాణక్య వంటి సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించనున్నాయి. Way2Newsలో వేగంగా, ఎక్స్‌క్లూజివ్‌గా ఎగ్జిట్ పోల్స్ తెలుసుకోవచ్చు.

error: Content is protected !!