News April 24, 2024

దొరల పెత్తనమని.. బీఆర్ఎస్‌లోకే వెళ్లారు: రేవంత్

image

TG: IPS పదవికి RS ప్రవీణ్ కుమార్ రాజీనామా చేస్తే తాము అండగా నిలబడినట్లు CM రేవంత్ వెల్లడించారు. ‘దొరల పెత్తనం సహించలేక రాజీనామా చేస్తున్నానని ప్రవీణ్ అన్నారు. KCRకు వ్యతిరేకంగా కొట్లాడాలంటే ప్రవీణ్ కాంగ్రెస్‌లోకి రావొచ్చు కదా? దొరల పెత్తనమని చెప్పి.. మళ్లీ BRS పార్టీలోనే చేరారు. TSPSC ఛైర్మన్‌గా నియమించాలని అనుకున్నాం. ఆయన తిరస్కరించారు. IPSగా ఆయన ఉండుంటే.. డీజీపీని చేసేవాళ్లం’ అని తెలిపారు.

Similar News

News December 29, 2025

రూ.600 కోట్లకు అల్లు అర్జున్ సినిమా OTT రైట్స్!

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో దాదాపు రూ.1,000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న భారీ చిత్రం విడుదలకు ముందే రికార్డులు సృష్టించేలా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రముఖ OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ రైట్స్‌ను రూ.600 కోట్లకు దక్కించుకునేందుకు చర్చలు జరుపుతోందని టాక్. డీల్ ఫిక్స్ అయితే భారతీయ చిత్రాల్లో ఇదే అత్యధికం కానుంది.

News December 29, 2025

సాగుకు ఆధునిక యంత్రాల సాయం.. రైతుకు తగ్గిన శ్రమ

image

గతంలో వరి, ఇతర పంటల సాగులో నారు, విత్తనం దశ నుంచి కోత వరకు మానవ శ్రమ, ఎడ్ల శ్రమ ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణల కారణంగా పంట నాటే దశ నుంచి కోత వరకు అనేక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా నాగలి, దంతె, గొర్రు వంటి పనిముట్ల వినియోగం బాగా తగ్గింది. పంట నాటే దశ నుంచి కోత వరకు ఆధునిక యంత్రాలు కీలకపాత్ర పోషిస్తూ అన్నదాత శ్రమను తగ్గించి సమయాన్ని ఆదా చేస్తున్నాయి.

News December 29, 2025

Pawar PoliTricks: అబ్బాయ్-బాబాయ్ కలిశారు

image

మహారాష్ట్రలో ఫ్యామిలీస్ రీయునైట్ అవుతున్నాయి. మొన్న ముంబై కార్పొరేషన్ ఎన్నికల కోసం ఠాక్రే సోదరులు కలిస్తే నిన్న పింప్రీ పీఠానికై పవార్స్ ఒకే పరివార్ అని ప్రకటించుకున్నారు. పింప్రీ-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన NCP, బాబాయ్ శరద్ పవార్ NCP (SP)లు కలిసి పోటీ చేస్తాయని అజిత్ పవార్ ప్రకటించారు. 1999-2017 వరకు ఈ మున్సిపల్ కార్పొరేషన్ అవిభాజ్య NCP చేతిలో ఉండేది.