News April 25, 2024
93.5% మార్కులు.. మూర్ఛపోయిన విద్యార్థి

ఊహించిన దానికంటే ఎక్కువ మార్కులు వస్తే ఎగిరి గంతులు వేయడం కామన్. అయితే.. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ స్టూడెంట్కి మాత్రం వింత అనుభవం ఎదురైంది. ఇటీవల UP SSC బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో టెన్త్ విద్యార్థి అన్షుల్ కుమార్(16)కు 93.5% మార్కులు వచ్చాయి. అయితే తనకు ఊహించినదానికంటే ఎక్కువ మార్కులు రావడంతో అతడు మూర్ఛపోయాడు. దీంతో అతడిని ICUలో చేర్చాల్సి వచ్చింది.
Similar News
News March 14, 2026
అంగన్వాడీ ఆయాలకు ప్రమోషన్లు.. మార్గదర్శకాలివే

AP: అంగన్వాడీ హెల్పర్లను వర్కర్లుగా పదోన్నతి కల్పించడానికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ఖాళీగా ఉన్న వర్కర్ పోస్టుల్లో 50% అర్హులైన హెల్పర్లతో భర్తీ చేయాలి. టెన్త్ ఉత్తీర్ణత, ఐదేళ్ల సర్వీసు, ఫిట్నెస్ తప్పనిసరి. నియామక సంవత్సరం జులై 1 నాటికి 50yrs దాటకూడదు. సీనియారిటీ, వయస్సు, విద్యార్హతలను బట్టి పదోన్నతులు కల్పిస్తారు. ప్రభుత్వ రిజర్వేషన్లు కచ్చితంగా పాటించాలి.
News March 14, 2026
పుచ్చకాయ కొనేటప్పుడు ఇవి గమనించండి!

పుచ్చకాయపై ఉండే మచ్చ పసుపు/నారింజ రంగులో ఉంటే పండినట్లు, తెల్లగా ఉంటే ఇంకా పండనట్లు. గుండ్రటి కాయలు తీయగా ఉంటాయి. పొడవుగా ఉండేవి తక్కువ తీపి కలిగి ఉంటాయి. ఒకే సైజులో ఉన్న వాటిలో బరువు ఎక్కువగా ఉన్నది తీసుకోవాలి. వాటిలో గుజ్జు, రసం ఎక్కువగా ఉంటాయి. కాయ కాడ పూర్తిగా ఎండిపోయి, మెరుపు తక్కువగా ఉంటే అది సహజంగా పాదుపైనే పండిందని అర్థం. గోధుమ రంగు గీతలు ఉన్న కాయలు చాలా తీయగా ఉంటాయి.
News March 14, 2026
పుతిన్ ప్రపోజల్కు నో చెప్పిన ట్రంప్!

ఇరాన్ వద్ద ఉన్న 450 కిలోల (60% శుద్ధి చేసిన) యురేనియంను రష్యాకు తరలించాలని పుతిన్ చేసిన ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. యుద్ధాన్ని ఆపేందుకు ఇది ఒక మార్గమని పుతిన్ చెప్పినట్లు తెలిపింది. ఈ యురేనియంతో సుమారు 11 అణు బాంబులను తయారు చేయవచ్చని సమాచారం. అందుకే ఈ యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవాలి లేదా పనికిరాకుండా చేయాలని US ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.


