News April 25, 2024
రైల్వే ప్రయాణికులకు అందుబాటు ధరలో భోజనం

జనరల్ క్లాస్ ప్రయాణికులకు సరసమైన ధరకే ఆహారం అందించే కార్యక్రమానికి రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. అన్రిజర్వ్డ్, జనరల్ కోచ్లలో ప్రయాణించే ప్యాసింజర్లు పరిశుభ్రమైన భోజనం, స్నాక్స్ అందుబాటు ధరల్లో పొందగలరని రైల్వేశాఖ తెలిపింది. ఎకానమీ మీల్ ధర రూ.20, స్నాక్ మీల్ ధర రూ.50 కాగా.. ప్రధాన రైల్వేస్టేషన్లలో ఇవి అందుబాటులోకి వచ్చాయి.
Similar News
News March 24, 2026
72 గంటల ముందుగా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఫుల్ రిఫండ్

టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల్లో రైల్వే శాఖ కీలక మార్పులు చేసింది. ఇకపై 72 గంటల ముందుగా టికెట్ను రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం(నామమాత్రపు ఫ్లాట్ క్యాన్సిలేషన్ ఛార్జీ కట్ అవుతుంది) తిరిగి ఇవ్వనుంది. 72 నుంచి 24 గంటల్లోపు అయితే 25 శాతం, 24 గంటల నుంచి 8 గంటల్లోపు అయితే 50 శాతం కట్ చేయనుంది. 8 గంటల్లోపు అయితే ఎలాంటి రిఫండ్ ఉండదు. ఏప్రిల్ 1 నుంచి 15 మధ్యలో ఈ రూల్స్ను అమల్లోకి తేనుంది.
News March 24, 2026
సంచలనం.. యుద్ధంలోకి సౌదీ, UAE?

పశ్చిమాసియాలో యుద్ధం విస్తరించే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్పై అమెరికా చేస్తోన్న దాడుల్లో సౌదీ, UAE పాల్గొనేందుకు సిద్ధమైనట్లు ‘వాల్స్ట్రీట్ జనరల్’ వెల్లడించింది. తమ వైమానిక స్థావరాలను US వాడుకొనేందుకు సౌదీ ఓకే చెప్పినట్లు తెలిపింది. తమ దేశంలోని టెహ్రాన్కు చెందిన ఆస్పత్రి, క్లబ్ను UAE మూసేసినట్లు పేర్కొంది. తమ రిఫైనరీలపై ఇరాన్ దాడులను ఉపేక్షించబోమని ఇటీవల గల్ఫ్ దేశాలు ప్రకటించడం తెలిసిందే.
News March 24, 2026
సుప్రీం తీర్పు సరే.. క్రైస్తవంలో చేరారని నిరూపించేదెలా?

క్రైస్తవంలోకి మారిన వారు SC హక్కులు పొందలేరని సుప్రీంకోర్టు <<19462779>>తీర్పు<<>> ఇచ్చింది. అయితే బాప్టిజం సర్టిఫికెట్ లేకుండా క్రైస్తవాన్ని స్వీకరించినట్లు నిరూపించడం ఎలాగనేది అతిపెద్ద ప్రశ్న. ఎందుకంటే చర్చికి వెళ్లడం, పేర్లు మార్చుకోవడంతో మతం మారినట్లు చెప్పలేం. అలాంటి చట్టాలేవీ దేశంలో అమలులో లేవు. పలు రాష్ట్రాల్లో మత నిరోధక బిల్లులున్నా వాటి పాత్ర పరిమితం. ఈ అంశంపై విధివిధానాల రూపకల్పన అవసరం. ఏమంటారు?


