News April 25, 2024

జగన్‌పై దాడి కేసు.. సతీశ్‌కు పోలీస్ కస్టడీ

image

AP: సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితుడు సతీశ్‌ను పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయవాడ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో A1గా ఉన్న ఆయన్ను 3 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 27 వరకు పోలీసులు సతీశ్‌ను విచారించనున్నారు. లాయర్ సమక్షంలో అతడిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే విచారించాలని.. థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.

Similar News

News March 22, 2026

సినిమా కోసం 10 కేజీల బరువు తగ్గిన ఎన్టీఆర్!

image

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం Jr.NTR స్ట్రిక్ట్ డైట్ పాటిస్తున్నారని ఆయన ట్రైనింగ్ టీమ్ వెల్లడించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. 7 వారాల్లో 10kgs బరువు తగ్గారని తెలిపాయి. డైరెక్టర్ లీన్ ఫిజిక్ కావాలని చెప్పడంతో రోజూ 90min ఫంక్షనల్ ట్రైనింగ్ చేస్తూ కంట్రోల్ డైట్ పాటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ HYDలో జరుగుతోంది. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

News March 22, 2026

ఈ IPL సీజన్ గిల్‌కు మంచి అవకాశం: పుజారా

image

IPL-2026లో శుభ్‌మన్ గిల్ చెలరేగి ఆడితే భారత T20 జట్టులో తిరిగి స్థానం పొందే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ పుజారా అభిప్రాయపడ్డారు. ‘గిల్ క్వాలిటీ ప్లేయర్. T20 WC జట్టులో చోటు దక్కకపోవడం అతడిలో కసిని పెంచి ఉంటుంది. ఈ IPL సీజన్ మంచి అవకాశం. 150-160SRతో బ్యాటింగ్ చేయగలనని నిరూపించుకోవాలి. ఈ టైమ్‌లో అతడిపై ఒత్తిడి ఉంటుంది’ అని పేర్కొన్నారు. IPLలో గుజరాత్ టైటాన్స్‌కు గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.

News March 22, 2026

వ్యర్థాలతో గ్యాస్ ఉత్పత్తి.. 5 ప్లాంట్ల ఏర్పాటు

image

AP: పట్టణ ప్రాంతాల్లోని ఘన వ్యర్థాలను కంప్రెస్డ్ బయో గ్యాస్‌(CBG)గా మార్చే ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాజమండ్రి, నెల్లూరు, గుంటూరు, ఒంగోలులో కొత్తగా వీటిని ఏర్పాటు చేయనుండగా, విజయవాడలో ఇప్పటికే ఉన్న ప్లాంట్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నారు. దీని కోసం ప్రభుత్వం రూ.59.85కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ప్రతి CBG ప్లాంట్ సామర్థ్యం రోజుకు 25 టన్నులు ఉంటుంది.