News April 25, 2024
ఇంటర్లో ఫెయిలయ్యామని మరో నలుగురు విద్యార్థుల ఆత్మహత్య

TG: ఇంటర్ ఫలితాల్లో ఫెయిలయ్యామనే మనస్తాపంతో నలుగురు విద్యార్థులు <<13114471>>ఆత్మహత్య<<>> చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో చిప్ప భార్గవి ఉరివేసుకోగా.. యశస్విని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. HYD మెహిదీపట్నంలో హర్షిణి, పఠాన్చెరుకు చెందిన సాయితేజ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని పలువురు సూచిస్తున్నారు.
Similar News
News December 27, 2025
‘పుష్ప-2’ తొక్కిసలాట.. ఛార్జ్షీట్ దాఖలు

TG: గత ఏడాది ‘పుష్ప-2’ ప్రీమియర్ సందర్భంగా HYDలోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు నమోదు చేశారు. ఏ-1గా సంధ్య థియేటర్ మేనేజ్మెంట్, ఏ-11గా అల్లు అర్జున్ను పేర్కొన్నారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.
News December 27, 2025
కృష్ణా జిల్లాలో 60 పోస్టులకు నోటిఫికేషన్

AP: హెల్త్ మెడికల్&ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కృష్ణా జిల్లాలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, MLT, BSc(MLT), ఇంటర్ ఒకేషనల్ (MLT, ఫార్మసీ), DMLT, డిప్లొమా, బీఫార్మసీ, PGDCA, డిగ్రీ(కంప్యూటర్స్) ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42 ఏళ్లు. వెబ్సైట్: https://krishna.ap.gov.in/
News December 27, 2025
సాగులో భూసార పరీక్షలు కీలకం.. నిర్లక్ష్యం వద్దు

భూమిలో ఏ పంటలు వేయాలి, ఏ మందులు ఎంత మోతాదులో వేయాలో తెలియక రైతులు అధికమొత్తంలో రసాయన ఎరువులను వాడుతున్నారు. ఇది సాగుభూమికి శాపంగా మారుతోంది. దీనికి పరిష్కారంగా భూసార పరీక్ష, నీటి పరీక్ష, అవసరమైతే పత్ర విశ్లేషణ పరీక్షలు చేయించాలి. వీటి వల్ల నేల, నీరు, ఆకులు, మొక్కల్లో ఏ పోషకాలున్నాయి, పంటలకు ఏ ఎరువులు ఎంత వేయాలనే విషయం కచ్చితంగా తెలుస్తుంది. ఎరువుల వాడకంలో సమతుల్యత పాటిస్తే భూమి సారవంతమవుతుంది.


