News April 25, 2024
రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్.. రూ.20కే భోజనం!

రైలు ప్రయాణికులకు భారత రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం రూ.20కే భోజనం అందించే పథకాన్ని 100 స్టేషన్లకు పెంచుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 51 స్టేషన్లలో ఈ కార్యక్రమం నడుస్తోంది. రైళ్ల జనరల్ క్లాస్ బోగీలు ఆగే చోట ఈ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే వివరించింది. రూ.20కి భోజనంతో పాటు రూ.50కి స్నాక్స్ను పరిశుభ్రంగా, అందరికీ అందుబాటు ధరలో ఇస్తున్నామని ఓ ప్రకటనలో చెప్పింది.
Similar News
News January 30, 2026
‘పుర’ సేవలు మరింత సులభం

AP: పౌరసేవలను మెరుగుపర్చేలా మున్సిపల్ శాఖ 123 మున్సిపాలిటీలను అనుసంధానిస్తూ ఇంటిగ్రేటెడ్ డ్యాష్ బోర్డు, వెబ్సైట్లను రూపొందించింది. పురమిత్ర అనే AI-ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ను వీటికి ఇంటిగ్రేట్ చేసింది. పౌరులు మొబైల్ నంబరు నమోదుతో అవసరమైన సర్వీస్లు అందుకోవచ్చు. అసెస్మెంట్ నంబర్ లింకుతో ఫిర్యాదులు, ఆస్తి ఇతర వివరాలు పొందవచ్చు. నీటి సరఫరా, శానిటేషన్పై అధికారులు నిత్యం పర్యవేక్షిస్తారు.
News January 30, 2026
7,948 పోస్టులు.. సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు వచ్చేశాయ్..

నిరుద్యోగ అభ్యర్థులకు అలర్ట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 7,948 <
News January 30, 2026
యువరాజ్ ఫ్యామిలీ లేటెస్ట్ ఫొటో చూశారా?

సినీ గ్లామర్ను వదిలేసి అచ్చమైన భారతీయ ఇల్లాలుగా మారిపోయిన హేజల్ కీచ్ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పటి స్టార్ మోడల్, యువరాజ్ సింగ్ భార్య ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఫొటో నెట్టింట వైరలవుతోంది. మోడలింగ్, మేకప్ పక్కన పెట్టి.. పిల్లల సంరక్షణలో ఆమె మునిగిపోయారు. గ్లామర్ కంటే కుటుంబంతో ఉండే సింప్లిసిటీలోనే అసలైన అందం, ఆనందం ఉందని హేజల్ నిరూపిస్తున్నారని నెటిజన్లు కొనియాడుతున్నారు.


