News April 28, 2024

నేటి నుంచి సీఎం మలి విడత ప్రచారం

image

AP: సీఎం జగన్ నేటి నుంచి మలి విడత ఎన్నికల ప్రచారానికి తెర లేపనున్నారు. ఇవాళ మూడు నియోజకవర్గాల్లో జరిగే సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో.. ఆ తర్వాత వెంకటగిరిలో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో జరిగే ప్రచార సభకు హాజరవుతారు. రోజుకు 3 సభల్లో పాల్గొనేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు సమాచారం.

Similar News

News November 10, 2025

అధ్యక్షా అనడం ఇష్టంలేకే జగన్ అసెంబ్లీకి రావట్లేదు: అయ్యన్న

image

AP: జగన్ పులివెందుల MLA మాత్రమేనని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. జగన్, YCP MLAలు అసెంబ్లీకి రాకపోవడంపై ఆయన మరోసారి స్పందించారు. ‘అసెంబ్లీలో సాధారణ MLAకి ఇచ్చే సమయమే జగన్‌కు ఇస్తాం. ఆయన మీడియా ముందు కాకుండా అసెంబ్లీకొచ్చి మాట్లాడాలి. నా ముందు అధ్యక్షా అనడం ఇష్టంలేకే అసెంబ్లీకి రావడం లేదు. YCP ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు. కానీ, అసెంబ్లీకి మాత్రం రావట్లేదు’ అని వ్యాఖ్యానించారు.

News November 10, 2025

భూముల్లో సూక్ష్మపోషక లోపాలు ఎందుకు వస్తాయి?

image

తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో జింకు, ఇనుము, బోరాన్ లోపం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. బెట్టకు గురయ్యే నేలల్లో బోరాన్, ఇనుము, మాంగనీసు లోపం.. నీరు నిలిచే లోతట్టు భూములు, మురుగు నీరు పోని భూములు, అన్నివేళలా నీరు పెట్టే వరి పొలాల్లో జింక్ లోపం వచ్చే అవకాశం ఎక్కువ. సాగు నీటిలో కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, నేలలో సున్నం పాళ్లు ఎక్కువైనప్పుడు ఇనుపదాతు లోపం కనిపిస్తోంది.

News November 10, 2025

తల్లి పరీక్ష రాస్తుండగా ఏడ్చిన బిడ్డ.. పాలిచ్చిన పోలీసమ్మ!

image

ఓ బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది అంటారు. ఇలాంటి ఘటనే ఒడిశాలో జరిగింది. పరీక్ష రాసేందుకు బిడ్డతో సెంటర్‌కు వచ్చిన ఓ తల్లి.. తన బిడ్డను బయటే ఉంచేసింది. ఆకలితో ఆ శిశువు గుక్కపట్టి ఏడ్వడంతో అక్కడే ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ వెంటనే ఆ బిడ్డను హత్తుకున్నారు. పరీక్ష పూర్తయ్యే వరకూ ఆమె స్వయంగా పాలిచ్చి లాలించారు. కానిస్టేబుల్ చూపిన మాతృప్రేమపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.