News April 28, 2024
క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారికి అండగా మంత్రి

TG: అరుదైన క్యాన్సర్తో బాధపడుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి వేదవల్లికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అండగా నిలిచారు. మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు సహకరిస్తామని తెలిపారు. ప్రభుత్వం తరఫున ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎల్బీనగర్కు చెందిన వేదవల్లి వైద్యానికి ఇప్పటికే రూ.40 లక్షలు ఖర్చవగా.. మరో రూ.20 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు.
Similar News
News January 26, 2026
ఇండోర్లో కలుషిత నీరు.. 28కి చేరిన మరణాలు

MPలోని ఇండోర్లో కలుషిత నీరు తాగి మరణించిన వారి సంఖ్య 28కి చేరింది. భగీరథ్పురలో 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మోవ్లో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. అటు ప్రభుత్వం 21 మంది మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. కాగా బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఇండోర్ కలెక్టర్ శివమ్ వర్మ తెలిపారు.
News January 26, 2026
312 పోస్టులు.. అప్లైకి మూడు రోజులే ఛాన్స్

RRB ఐసోలేటెడ్ కేటగిరీలో 312 పోస్టులకు అప్లై చేయడానికి 3 రోజులే ( JAN 29) సమయం ఉంది. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, LLB, MBA, డిప్లొమా, PG(హిందీ, ఇంగ్లిష్, సైకాలజీ) అర్హతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. CBT(1, 2), స్కిల్ టెస్ట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.19,900-రూ.44,900 వరకు చెల్లిస్తారు. సైట్: www.rrbcdg.gov.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News January 26, 2026
RITESలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


