News January 30, 2026

పవన్ కళ్యాణ్‌ని కలిసిన విజయనగరం మత్స్యకార కుటుంబ సభ్యులు

image

భోగాపురం, పూసపాటిరేగ తీరప్రాంతం మండలాలకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు ఇటీవల బంగ్లాదేశ్ నుంచి విడుదల అయిన సంగతి తెలిసిందే. మత్స్యకారులు బంగ్లాదేశ్ చెర నుంచి విడిపించడంలో కూటమి ప్రభుత్వం చేసిన కృషికి మత్స్యకార కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని కలిశారు. ప్రభుత్వం నుంచి మరింత సహాయం అందేలా చూడాలని పవన్ కళ్యాణ్‌ని మత్యకారులు కోరారు.

Similar News

News February 2, 2026

ప్రతి కుటుంబానికి రూ.25లక్షల వైద్య బీమా: మంత్రి

image

ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల విలువైన వైద్య బీమా కల్పించే పథకాన్ని సీఎం చంద్రబాబు రూపకల్పన చేశారని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఎస్.కోటలో సోమవారం పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కిడ్నీ రోగుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 65 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఒక్కో రోగికి ఏడాదికి సుమారు రూ.20 వేలు ఖర్చు చేయడమే కాకుండా నెలకు రూ.10 వేలు పింఛన్ కూడా ఇస్తున్నామని తెలిపారు.

News February 2, 2026

పలు కేసుల్లో నిందితుడిపై PD యాక్ట్: VZM SP

image

పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న మజ్జి కృష్ణవర్ధన్ (చెర్రీ)పై జిల్లా పోలీసు శాఖ PD యాక్ట్ ప్రయోగించింది. నిందితుడిని ముందస్తు నిర్బంధంలో భాగంగా విశాఖ సెంట్రల్ జైలుకు తరలించామని SP దామోదర్ ఆదివారం తెలిపారు. గత ఐదేళ్లలో విజయనగరానికి చెందిన చెర్రీపై పట్టణ పోలీస్ స్టేషన్‌లో 8, మహిళా పోలీస్ స్టేషన్‌లో ఒక కేసులో నిందితుడిగా అరెస్టు అయ్యాడన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.

News February 2, 2026

VZM: కలెక్టరేట్‌లో నేడు PGRS కార్యక్రమం

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్‌లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.