News April 28, 2024

నేను తలచుకుంటే అందరూ జైలుకే: రేవంత్

image

TG: తాను తలచుకుంటే ఎవరూ బయట తిరగలేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘నేను పోలీస్ రాజ్యం నడపను. రేవంత్ అనే పదం కొందరికి లైఫ్ లైన్‌గా మారింది. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతోంది. అది ఎక్కడికెళ్లి ఆగుతుందో తెలియదు. నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు చెబుతాం. BJP నేతల మాటల్లోనే భయం కనిపిస్తోంది. నేను పాలనపై దృష్టి పెడుతుంటే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Similar News

News February 4, 2026

కల్కి పార్ట్-2లో 90 నిమిషాల పాటు కమల్!

image

రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో రానున్న కల్కి పార్ట్-2పై భారీ అంచనాలున్నాయి. FEB చివరి వారం నుంచి ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే పార్ట్-1లో తక్కువ నిడివి ఉన్న కమల్ హాసన్ పాత్ర పార్ట్-2లో 90 నిమిషాల పాటు ఉంటుందట. అలాగే 2 వెరైటీ లుక్స్‌లో కనిపించనున్నారని సినీ వర్గాల టాక్. దీనికి తోడు ఈ మూవీలో సాయి పల్లవి కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

News February 4, 2026

రైతులకు గుడ్‌న్యూస్.. విపత్తుల టైమ్‌లో డాక్యుమెంట్స్ లేకుండా లోన్?

image

వరదల వంటి విపత్తుల టైంలో రైతుల నుంచి బ్యాంకులు బలవంతంగా లోన్లు వసూలు చేయొద్దని RBI సూచించింది. కొత్త డ్రాఫ్ట్ ప్రకారం.. ‘బాధిత రైతులకు EMIల రీ-షెడ్యూలింగ్, మారటోరియం, డాక్యుమెంట్స్ లేకుండా టాపప్ లోన్ల వంటి సదుపాయాలు కల్పించాలి. ఎక్స్‌ట్రా ఛార్జీలు ఏడాది వరకు రద్దు చేయాలి. విపత్తుకు ముందు 30 రోజుల కంటే ఎక్కువ డిఫాల్ట్ అయి ఉండొద్దు’ పేర్కొంది. వీటికి ఆమోదం లభిస్తే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

News February 4, 2026

దేశీ మిర్చికి రికార్డు ధర.. క్వింటా రూ.41,200

image

TG: వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో దేశీ మిర్చి రికార్డు ధర పలికింది. క్వింటా మిర్చి రూ.41,200కు అమ్ముడుపోయింది. గత మూడేళ్లలో దేశీ మిర్చికి ఇదే రికార్డు ధర అని మార్కెట్ అధికారులు వెల్లడించారు. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన దస్తగిరి అనే రైతు తీసుకొచ్చిన 6 క్వింటాళ్ల దేశీ మిర్చిని వ్యాపారులు ఈ ధరకు కొనుగోలు చేశారు.