News April 30, 2024

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం ప్రచారం

image

AP: సీఎం జగన్ ప్రచార పర్వం కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మూడు నియోజకవర్గాల్లో సీఎం పర్యటిస్తారని వైసీపీ ప్రధాన కార్యదర్శి రఘురాం తెలిపారు. ఉదయం 10 గంటలకు కొండేపి నియోజకవర్గంలో, మధ్యాహ్నం 12:30 గంటలకు కడప(D) మైదుకూరు నియోజకవర్గంలో, మధ్యాహ్నం 3 గంటలకు పీలేరు నియోజకవర్గంలో జరిగే సభల్లో ఆయన ప్రసంగిస్తారని తెలిపారు.

Similar News

News October 27, 2025

WWC: ప్రతీకా స్థానంలో షెఫాలీ వర్మ!

image

మహిళా వన్డే వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో గాయపడిన భారత ఓపెనర్ ప్రతీకా రావల్ స్థానంలో షెఫాలీవర్మ జట్టులోకి రానున్నారు. ఆస్ట్రేలియాతో ఈ నెల 30న జరిగే సెమీఫైనల్లో ఆమె జట్టులో చేరుతారని ESPN పేర్కొంది. కాగా గాయం కారణంగా ప్రతీకా టోర్నీలో మిగతా మ్యాచులకు దూరమయ్యారని వెల్లడించింది. దూకుడుగా ఆడే ప్లేయర్‌గా పేరున్న షెఫాలీ రాకతో జట్టుకు బలం చేకూరనుంది. ఈ మార్పుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News October 27, 2025

92 ఏళ్ల వయసులో దేశాధ్యక్షుడిగా ఎన్నిక

image

కామెరూన్ అధ్యక్షుడిగా పాల్ బియా(92) ఎనిమిదో సారి ఎన్నికయ్యారు. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ప్రెసిడెంట్‌గా చరిత్ర సృష్టించారు. ఈనెల 12న జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించినట్లు అక్కడి రాజ్యాంగ మండలి ఇవాళ ప్రకటించింది. సుమారు 3 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి 1982 నుంచి ప్రెసిడెంట్‌గా బియా కొనసాగుతుండటం గమనార్హం. మరోవైపు ప్రతిపక్షాల మద్దతుదారులు ఆందోళన చేపట్టగా ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనల్లో నలుగురు చనిపోయారు.

News October 27, 2025

ఎస్‌బీఐలో మరో 3,500 పోస్టుల భర్తీ

image

నిరుద్యోగులకు SBI గుడ్‌న్యూస్ చెప్పింది. 3,500 PO పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. గత జూన్‌లో 505 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను నియమించామని, ప్రస్తుతం 541 PO పోస్టులకు దరఖాస్తులు కొనసాగుతున్నాయని చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కిశోర్ కుమార్ పోలుదాసు చెప్పారు. ఈ FYలోనే మరో 3వేల సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. త్వరలో వీటికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని PTI ఇంటర్వ్యూలో తెలిపారు.