News April 30, 2024
నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం ప్రచారం

AP: సీఎం జగన్ ప్రచార పర్వం కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మూడు నియోజకవర్గాల్లో సీఎం పర్యటిస్తారని వైసీపీ ప్రధాన కార్యదర్శి రఘురాం తెలిపారు. ఉదయం 10 గంటలకు కొండేపి నియోజకవర్గంలో, మధ్యాహ్నం 12:30 గంటలకు కడప(D) మైదుకూరు నియోజకవర్గంలో, మధ్యాహ్నం 3 గంటలకు పీలేరు నియోజకవర్గంలో జరిగే సభల్లో ఆయన ప్రసంగిస్తారని తెలిపారు.
Similar News
News April 16, 2026
యుద్ధానికి సిద్ధపడుతున్న ఇరాన్?

US-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు ఓవైపు పాక్ సన్నాహాలు చేస్తున్న వేళ ఇరాన్లో పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి. ఏప్రిల్ 21 నుంచి స్కూళ్లకు వర్చువల్ లెర్నింగ్ అమలు చేయనుంది. స్కూళ్లపైనా గతంలో <<19620831>>దాడులు<<>> జరిగిన నేపథ్యంలో మళ్లీ యుద్ధం మొదలైతే పిల్లలకు రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే మిస్సైల్ కేంద్రాల మరమ్మతులను ఇరాన్ ముమ్మరం చేసింది.
News April 16, 2026
రాష్ట్రమంతటిపై ‘అమరావతి’ భారం: సజ్జల

AP: అమరావతి పేరుతో చంద్రబాబు రూ.వేలకోట్లు దోచుకుంటున్నారని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ‘CBN చేస్తున్నది సంపద సృష్టికాదు దోపిడీ. ఇతర చోట్ల ఇటువంటి నిర్మాణాలకు Sftకి ₹3వేలలోపు ఉంటే ఇక్కడ ₹14వేలు ఖర్చు చేస్తున్నారు. హైరైజ్డ్ పేరిట 40-50 అంతస్తులు కడుతూ మొబిలైజేషన్ అడ్వాన్సులిస్తున్నారు. ఇదంతా మోయలేని భారం. ఆ ఖర్చును రాష్ట్రమంతా భరించాలంటున్నారు’ అని పార్టీ BC నేతల భేటీలో విమర్శించారు.
News April 16, 2026
రామాయణ ఫైనల్ ఔట్పుట్ అదిరిపోతుంది: యశ్

‘రామాయణ’ VFXపై విమర్శలు వస్తున్న వేళ యశ్ కామెంట్స్ ఫ్యాన్స్లో అంచనాలు పెంచుతున్నాయి. ఈ మూవీకి పనిచేస్తున్నది ప్రతిష్ఠాత్మక DNEG కంపెనీ అని, ఫైనల్ ఔట్పుట్ అదిరిపోతుందని అన్నారు. గ్రాఫిక్స్ ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయన్నారు. కాగా DNEG డ్యూన్-2, టెనెట్, ఇంటర్స్టెల్లార్ వంటి బ్లాక్బస్టర్లకు గ్రాఫిక్స్ అందించింది. ఈ నేపథ్యంలో సినిమా ఔట్పుట్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.


