News February 14, 2026
TU: పూణే ఎన్ఎస్ఎస్ క్యాంప్లో టీయూ విద్యార్థులు

పూణేలోని సావిత్రిబాయి విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఎన్ఎస్ఎస్ క్యాంప్లో టీయూ విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించి ప్రశంసలు పొందారు. యోగా, మెడిటేషన్తో ప్రారంభమైన జాతీయస్థాయి క్యాంపులో మానసిక అవగాహన, వ్యసన వ్యతిరేక ప్రచారం, సంప్రదాయ క్రీడలు, బతుకమ్మ పండుగ తదితర అంశాలపై చక్కని ప్రదర్శన ఇవ్వడం పట్ల విద్యార్థుల ప్రతిభను ప్రశంసించినట్లు టీయూ కోఆర్డినేటర్ అపర్ణ తెలిపారు.
Similar News
News April 19, 2026
మచిలీపట్నంలో నేడు బంగారం ధర ఎంతంటే!

అక్షయ తృతీయ కావడంతో జిల్లా కేంద్రంమైన మచిలీపట్నంలోని బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. మచిలీపట్నంలో ఆదివారం గ్రాము బంగారం రూ. 15,078 పలుకుతోంది. 10 గ్రాములు రూ. 1,50,780 చొప్పున విక్రయిస్తున్నారు. వెండి గ్రాము రూ.280గా ఉంది. అక్షయ తృతీయలో కనీసం గ్రాము బంగారమైనా కొనాలని పలువురు ఆసక్తి చూపుతున్నారు.
News April 19, 2026
భద్రాద్రి: యువత భవిష్యత్తుకు.. పంచాయతీ సంచలన నిర్ణయం

నాటు సారాయి తయారీ, విక్రయాలపై ఇల్లందు(M) ధనియాలపాడు GP ఉక్కుపాదం మోపింది. సర్పంచ్ సనప సావిత్రి వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక తీర్మానం చేశారు. ఎవరైనా సారాయి కాస్తూ పట్టుబడితే పోలీసు కేసులు, పీడీ యాక్ట్ నమోదు చేయడమే కాకుండా.. వారికి అందే రేషన్, పెన్షన్ వంటి ప్రభుత్వ పథకాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు.
News April 19, 2026
విజయనగరంలో నేడు బంగారం ధర ఎంతంటే..?

అక్షయ తృతీయ కావడంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. ఆదివారం గ్రాము బంగారం రూ.14,280 పలుకుతోంది. సవర(8గ్రాములు) రూ. 1,14,240 చొప్పున విక్రయిస్తున్నారు. ప్లాటినం గ్రాము 7,641 గా ఉంది. ఇక వెండి గ్రాము రూ.266 గా ఉంది. అక్షయ తృతీయలో కనీసం గ్రాము బంగారమైనా కొనాలని పలువురు ఆసక్తి చూపుతున్నారు.


