News May 1, 2024
ముంబైకి మరో షాక్.. ఆటగాళ్లందరికీ ఫైన్

ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు ఫైన్ పడింది. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో నిర్ణీత సమయానికి బౌలింగ్ పూర్తి చేయకపోవడంతో ‘స్లో ఓవర్ రేట్’ కింద కెప్టెన్ పాండ్యకు రూ.24లక్షల జరిమానా పడింది. జట్టు ఆటగాళ్లకు సైతం 25% మ్యాచ్ ఫీజు లేదా రూ.6లక్షల ఫైన్ పడింది. ఈ సీజన్లో పాండ్యకు ఇది రెండో ఫైన్. మరోసారి ఇలాగే జరిగితే.. మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంటుంది. కాగా LSGతో మ్యాచ్లో ముంబై ఓడిన విషయం తెలిసిందే.
Similar News
News March 22, 2026
‘చచ్చాడు.. సంతోషం’: ట్రంప్ నోటి దురుసు!

అమెరికాలో FBI మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ (81) కన్నుమూశారు. 9/11 దాడుల తర్వాత FBI రూపురేఖలు మార్చిన ఆయన ట్రంప్-రష్యా సంబంధాలపై ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ కక్షను మనసులో పెట్టుకున్న ట్రంప్.. ముల్లర్ చనిపోగానే ‘చచ్చాడు.. చాలా సంతోషం. ఇక అమాయకులను వేధించలేడు’ అని అన్నారు. ఒక లెజెండరీ ఆఫీసర్ అంటూ చాలా మంది సంతాపం తెలుపుతుంటే ట్రంప్ ఇలాంటి కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.
News March 22, 2026
కుల మీటింగ్స్కు వెళ్తే తప్పేంటి?: హైడ్రా కమిషనర్

కుల సమావేశాల్లో పాల్గొనడంపై వస్తున్న విమర్శలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ‘భారతదేశంలో కులాన్ని విడదీయలేం. మంచి విషయాల కోసమే వెళ్తున్నాను’ అని స్పష్టం చేశారు. తనకు పబ్లిసిటీ పిచ్చి లేదని కేవలం ప్రజల్లో అవగాహన కోసమే ఇంటర్వ్యూలు ఇస్తున్నానని చెప్పారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదన్నారు. 50 ఏళ్ల క్రితం నిర్మించిన తమ ఇంటికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయని తెలిపారు.
News March 22, 2026
మార్చి 22: చరిత్రలో ఈరోజు

1868: అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ జననం
2000: ఇన్సాట్-3బీ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది
2005: తమిళ నటుడు జెమినీ గణేశన్ మరణం
2009: సినీ నటుడు, నిర్మాత కాంతారావు మరణం (ఫొటోలో)
* ప్రపంచ జల దినోత్సవం


