News May 1, 2024
రింకూ సింగ్ లేకపోవడం పెద్ద లోటు: రాయుడు

T20 WC జట్టులో రింకూ సింగ్ లేకపోవడం పెద్ద లోటు అని అంబటి రాయుడు అభిప్రాయపడ్డారు. ‘అతడిని తప్పించడం చూస్తుంటే క్రికెటింగ్ సెన్స్ కంటే గణాంకాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని అర్థమవుతోంది. ఇప్పుడు ఎంపికైన ప్లేయర్లలో జడేజా మినహా ఏ ఆటగాడు గత రెండేళ్లలో చివరి ఓవర్లలో అధిక స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి మ్యాచును గెలిపించారు?. క్వాంటిటీ కంటే క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 29, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

★జి.సిగడాం: రోడ్డు ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్
★ గ్రూప్-2లో పలువురు సిక్కోలు వాసులు ఎంపిక
★టెక్కలి: బడిలో సేంద్రీయ సాగు.. విద్యార్థుల మెనూ బాగు
★SKLM: గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
★ లావేరు: అధ్వానంగా నేదురుపేట రోడ్డు
★ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపికైన బోరుభద్ర వాసి
★కంచిలి: బీసీ వసతిగృహంలో ఏసీబీ అధికారుల తనిఖీలు
News January 29, 2026
50 పరుగుల తేడాతో భారత్ ఓటమి

విశాఖలో జరిగిన 4వ T20లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా 18.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయింది. ఒకానొక సమయంలో దూబె(65) చెలరేగి ఆడటంతో గెలుపు దిశగా పయనించింది. అతను ఔటవ్వగానే కావాల్సిన రన్రేట్ పెరిగిపోయి 50 పరుగుల తేడాతో ఓడింది. శాంట్నర్ 3, సోధీ, డఫీ చెరో 2 వికెట్లు తీశారు.
News January 28, 2026
T-మున్సి‘పోల్స్’.. రంగంలోకి BJP అగ్రనేతలు!

TG: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా BJP రాష్ట్ర నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, హోం మంత్రి అమిత్ షాను ప్రచారానికి రావాలని ఆహ్వానించారు. FEB 2,3న మహబూబ్నగర్లో నితిన్ నబీన్, 8,9 తేదీల్లో నిర్మల్లో అమిత్షా సభ నిర్వహించాలని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారని తెలుస్తోంది. అగ్ర నేతల పర్యటనపై 2 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


