News February 16, 2026

విజయనగరం కలెక్టరేట్‌కు 259 వినతులు

image

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 259 వినతులు అందాయి. వీటిలో 166 పీజీఆర్ఎస్‌కు, 93 రెవెన్యూ క్లినిక్‌కు వచ్చాయి. డీఆర్ఓ మురళి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, కళావతి, నూకరాజు, బి. శాంతి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News April 17, 2026

జీజీహెచ్‌లో అత్యవసర పనులు వేగవంతం చేయాలి: VZM కలెక్టర్

image

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అత్యవసర అభివృద్ధి పనులకు వెంటనే ఆమోదం పొంది పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు అవసరమైన పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. విద్యుత్ వైరింగ్‌ను సక్రమంగా నిర్వహించి షార్ట్ సర్క్యూట్ నివారించాలని, నీటి పైప్‌లైన్ లీకేజీలను అరికట్టాలన్నారు.

News April 17, 2026

జీజీహెచ్‌లో అత్యవసర పనులు వేగవంతం చేయాలి: VZM కలెక్టర్

image

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అత్యవసర అభివృద్ధి పనులకు వెంటనే ఆమోదం పొంది పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు అవసరమైన పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. విద్యుత్ వైరింగ్‌ను సక్రమంగా నిర్వహించి షార్ట్ సర్క్యూట్ నివారించాలని, నీటి పైప్‌లైన్ లీకేజీలను అరికట్టాలన్నారు.

News April 17, 2026

VZM: ‘మంజూరైన పరిశ్రమలను వేగంగా ముందుకు తీసుకెళ్లాలి’

image

రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహ బోర్డు ద్వారా జిల్లాకు మంజూరైన పరిశ్రమలను వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం తన చాంబర్‌లో రెవెన్యూ, పరిశ్రమల శాఖ అధికారులతో విజయనగరం జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాకు 4 పరిశ్రమలు మంజూరయ్యాయని, వీటికి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా వచ్చాయన్నారు. ఆటంకాలు లేకుండా పనులను ప్రారంభించాలన్నారు.