News February 20, 2026

సైబర్ మోసాలపట్ల అవగాహన, అప్రమత్తతే ఆయుధం: VZM ఎస్పీ

image

సైబర్ మోసాల పట్ల అవగాహన లోపం కారణంగా ప్రజలు మోసాలకు గురవుతున్నారని విజయనగరం ఎస్పీ దామోదర్ పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయం నుంచి మాట్లాడారు. మోసగాళ్లు చెప్పే మాయమాటల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. OTP, వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930, www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News April 20, 2026

చెరువు వారీగా ప్రణాళిక వెంటనే పూర్తి కావాలి: VZM కలెక్టర్

image

జలధార- జలహారతిలో భాగంగా ప్రతి గ్రామంలో చెరువు వారీగా ప్రణాళికలను రూపొందించి వెంటనే పంపించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్న చెరువులకు మున్సిపల్ కమిషనర్, దేవస్థానాలకు సంబంధించిన పుష్కరిణి చెరువులకు కూడా దేవస్థానం అధికారులు ప్రణాళికలను రూపొందించాలని తెలిపారు. సోమవారం విజయనగరం కలెక్టరేట్లో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి జలధార-జలహరతిపై పలు సూచనలు చేశారు.

News April 19, 2026

VZM: 21న ఫుట్బాల్, బాక్సింగ్ క్రీడా ఎంపికలు

image

ఈ నెల 21, 23, 24 తేదీల్లో జిల్లా స్థాయి ఫుట్బాల్, బాక్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా అధికారి ఎస్.వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు. ఏప్రిల్ 21న ఫుట్ బాల్ మహిళా, 23న ఫుట్ బాల్ పురుషులు, 24న బాక్సింగ్ బాలబాలికలు ఎంపిక పోటీలు విజయనగరం రాజీవ్ క్రీడా ప్రాంగణంలో జరగనున్నాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు https://sports.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉ.8 గంటలకు హాజరుకావాలన్నారు.

News April 19, 2026

VZM: చందానోత్సవానికి వచ్చే వారికి ముఖ్య గమనిక

image

ఏప్రిల్ 20న సింహచలం చందనోత్సవానికి వస్తున్న భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించడంలేదు. దేవస్థానం సుమారు 100 బస్సులు ఏర్పాటు చేసి భక్తులను కొండపైకి తీసుకెళ్లనుంది. అయితే అనకాపల్లి, గోపాలపట్నం, పెందుర్తి, కొత్తవలస నుంచి వచ్చే వారు పాతగోశాల, శ్రీనివాస కళ్యాణ మండపం, సింహపురి కాలనీ వద్ద బస్సులు ఎక్కాలి. హనుమంతువాక నుంచి వచ్చే భక్తులు కొత్త గోశాల, అడవివరం కొత్త టోల్ గేట్ బస్ స్టాప్ వద్ద బస్సులు ఎక్కాలి.