News May 2, 2024

జగన్‌పై ఈసీ నిషేధం విధించాలి: ప్రత్తిపాటి

image

AP: సీఎం జగన్‌పై ఈసీ నిషేధం విధించాలని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. ‘జగన్ పదే పదే కోడ్ ఉల్లంఘిస్తున్నారు. విపక్ష నేతల వ్యక్తిగత జీవితాలపై ఆరోపణలు చేస్తున్నారు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలతో ప్రతిపక్ష నేతలపై బురద జల్లుతున్నారు. పవన్, చంద్రబాబును అసభ్యంగా తిడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్‌లాగే ఏపీలో జగన్‌పైనా నిషేధం విధించాలి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 3, 2026

రేపు ఢిల్లీలో NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

image

ప్రధాని మోదీ అధ్యక్షతన రేపు ఉదయం ఢిల్లీలో NDA కీలక సమావేశం జరపనుంది. ఈ భేటీలో బడ్జెట్ విశేషాలు, వికసిత్ భారత్@2047 విజన్, పార్లమెంటరీ అజెండాలపై చర్చించనున్నారు. FM నిర్మల బడ్జెట్ అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనుండగా, మోదీ MPలకు దిశానిర్దేశం చేస్తారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడమే లక్ష్యంగా వ్యూహరచన చేయనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన సహా కూటమి పార్టీల ఎంపీలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

News February 3, 2026

తెలుగువారి 52 ఏళ్ల ట్రైన్.. అరుదైన అవార్డు

image

హైదరాబాద్-విశాఖ మధ్య 52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం దక్కింది. 2025కు గాను బెస్ట్ మెయింటేన్డ్ ట్రైన్ అవార్డు లభించింది. ‘1974 నుంచి ఇదొక ట్రైన్ కంటే ఓ గొప్ప ఎమోషన్. ఎన్నో జ్ఞాపకాలు సొంతం చేసుకుంది. ట్రైన్ నంబర్ 12728 సెలబ్రేషన్స్ గొప్పగా నిర్వహించాం’ అని SCR ట్వీట్ చేసింది. ఈ రైలుతో మీకున్న అనుబంధంపై కామెంట్ చేయండి.

News February 3, 2026

భారత్‌పై టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌కు శుభవార్త చెప్పారు. టారిఫ్‌లు 25% నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ‘ఇవాళ PM మోదీతో మాట్లాడా. ఆయన నాకు గొప్ప స్నేహితుడు. శక్తిమంతమైన నాయకుడు. రష్యన్ చమురు కొనుగోలును ఆపడానికి, US, వెనిజులా నుంచి కొనుగోలు చేయడానికి ఆయన అంగీకరించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదిరింది’ అని ట్రూత్‌లో పోస్టు చేశారు.