News May 3, 2024
ఈ నెల 20 తర్వాత 10, 12th క్లాస్ ఫలితాలు: CBSE

ఈ ఏడాది 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలను ఈ నెల 20 తర్వాత వెల్లడిస్తామని CBSE వెల్లడించింది. రిజల్ట్స్పై సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని కోరింది. కాగా ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు టెన్త్, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు 12వ తరగతి పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా దాదాపు 39 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు.
Similar News
News March 28, 2026
రైతులకు ఐడీ కార్డులు.. ₹215 కోట్లతో ప్రోత్సాహకాలు

TG: రాష్ట్రంలో కూరగాయల సాగును పెంచేందుకు ప్రభుత్వం రైతులకు ప్రత్యేక ‘కిసాన్ ఐడీ కార్డులు’ జారీ చేయనుంది. వీటి ద్వారా లోన్లు, మార్కెటింగ్ సదుపాయాలు ఈజీగా అందుతాయి. ₹215 కోట్ల బడ్జెట్తో పందిళ్లు, యంత్ర పరికరాలపై 50% సబ్సిడీని ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో సాగు విస్తీర్ణాన్ని 2.50 లక్షల ఎకరాలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. కోతుల నుంచి రక్షణ కోసం సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకూ సహకారం అందించనుంది.
News March 28, 2026
వామ్మో.. సగం విమానాల్లో లోపాలు

గతేడాది కాలంలో తనిఖీ చేసిన 754 విమానాల్లో ఏకంగా 377 విమానాల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లు పార్లమెంటరీ కమిటీ గుర్తించింది. ముఖ్యంగా ఎయిరిండియా, ఇండిగో విమానాల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 2025 జూన్లో జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత చేపట్టిన ఆడిట్లో ఈ నిజాలు బయటపడ్డాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పూర్తిగా ప్రక్షాళన చేయాలని కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది.
News March 28, 2026
చిరంజీవి గొప్ప మనసు.. అవార్డు డబ్బు విరాళంగా

చిరంజీవి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇటీవల ప్రభుత్వం అందించిన ‘NTR జాతీయ పురస్కారం’తో పాటు వచ్చిన ₹10 లక్షలను ఆయన స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు. సర్వ్, దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్, వాల్మీకి, నయశ్రీ ఫౌండేషన్లతో పాటు క్యాన్సర్తో పోరాడుతున్న ఓ చిన్నారి చికిత్స కోసం బసవతారకం ఆసుపత్రికి ఈ సాయం అందించారు. శుక్రవారం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడం విశేషం.


