News March 5, 2026
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి: VZM DMHO

వేసవి నేపథ్యంలో వడదెబ్బ నుంచి రక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జీవన రాణి సూచించారు. విజయనగరంలోని తన కార్యాలయం ఆమె మాట్లాడారు. ఎండ తీవ్రతతో శరీర ఉష్ణోగ్రత అధికమై ప్రాణాపాయం కలగొచ్చని హెచ్చరించారు. చెమట పట్టకపోవడం, మగత, ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఎండలో తిరగకూడదని, తగినంత నీరు తాగాలన్నారు.
Similar News
News March 7, 2026
కొత్తవలసలో యాక్సిడెంట్.. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ

కొత్తవలస మండలం అర్ధానపాలెం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. భీమాలి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఏ.పరదేశి (38) కొత్తవలస నుంచి భీమాలి వైపు ఆటోతో వెళ్తున్నాడు. విజయనగరం నుంచి అనకాపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఆటో ఎదురుఎదురుగా ఢీకొనడంతో ఆటో డ్రైవర్ అక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News March 7, 2026
కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి కావాలి: VZM కలెక్టర్

ఏకీకృత కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. శనివారం మండల వారీగా కలెక్టర్ టీసీ ద్వారా సమీక్షించారు. ఎక్కువ పెండింగ్ ఉన్న మండలాల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో పూర్తి చేయని వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. జిల్లా పరిషత్ సీఈవో పర్యవేక్షించాలని గంట గంటకు రిపోర్ట్ సమర్పించాలని జి.ఎస్.డబ్ల్యు కో ఆర్డినేటర్ను ఆదేశించారు.
News March 7, 2026
బొండపల్లి: 24గంటల్లో బాలుడికి కొత్త ఆధార్ కార్డు

బొండపల్లి మండలం కిండాం అగ్రహారంకి చెందిన బుంగ జోసిత్ అనే ఏడాది బాలుడు అనారోగ్యంతో విజయనగరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య ప్రయోజనాలకు ఆధార్ కార్డు ఉండాలని ఆసుపత్రి తెలపగా..తండ్రి అప్పలనాయుడు పోస్టల్ శాఖను సంప్రదించాడు. గజపతినగరం సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర తమ సిబ్బందిని ఆసుపత్రికి పంపించి 24 గంటల్లో జోసిత్కు కొత్త ఆధార్ కార్డును ఎన్రోల్మెంట్ చేయించారు.


