News May 4, 2024

ప్లే ఆఫ్స్‌కు వెళ్తామని నమ్మకముంది: ఆర్సీబీ కోచ్

image

తమ జట్టు ప్లే ఆఫ్స్‌కు వెళ్తుందన్న నమ్మకం ఇంకా ఉందని ఆర్సీబీ హెడ్ కోచ్ యాండీ ఫ్లవర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు గుజరాత్‌తో హోం గ్రౌండ్‌లో మ్యాచ్ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘మా ప్లే ఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇప్పటికి వరసగా రెండు మ్యాచులు గెలిచాం. ఈరోజు కూడా గెలుస్తాం. మా ఆటగాళ్లు ఎప్పుడెప్పుడు ఆడదామా అని ఎదురుచూస్తున్నారు. మాకు ఇంకా నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.

Similar News

News November 6, 2025

ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ మృతి

image

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ అనునయ్ సూద్(32) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు ఇన్‌స్టాలో వెల్లడించారు. ఆయన మృతికి కారణాలు తెలియరాలేదు. నోయిడాకు చెందిన అనునయ్ దుబాయ్‌లో ట్రావెల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. 46 దేశాల్లో పర్యటించిన ఆయనకు ఇన్‌స్టాలో 14L, యూట్యూబ్‌లో 3.80L మంది ఫాలోవర్లు ఉన్నారు. 2022, 23, 24లో ఫోర్బ్స్ ఇండియా టాప్-100 డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటుదక్కించుకున్నారు.

News November 6, 2025

‘Google Photos’లో అదిరిపోయే ఫీచర్

image

చాలామంది తమ ఫోన్‌లో దిగిన ఫొటోలను ఫ్రెండ్స్‌కు పంపేందుకు వాట్సాప్ వాడతారు. ఇలా చేస్తే ఫొటోల క్లారిటీ తగ్గుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ‘గూగుల్ ఫొటోస్’ యాప్‌లో డైరెక్ట్‌గా మీ ఫ్రెండ్ మెయిల్ ఐడీకి యాక్సెస్ ఇవ్వొచ్చు. దీనికోసం <>Google Photos<<>> యాప్ ఓపెన్ చేసి Profile> Photo Settings> Sharing> partner sharing> specific date & time > Select> Receiver mail> Sent చేస్తే చాలు. ఈ ఫీచర్‌ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది.

News November 6, 2025

స్కూళ్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

image

TG: అన్ని స్కూళ్లలో రేపు ఉదయం 10 గంటలకు వందేమాతరం ఆలపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలని కేంద్రం చెప్పిన నేపథ్యంలో సర్కార్ తాజాగా ఉత్తర్వులిచ్చింది. పాఠశాలలతో పాటు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా వందేమాతరం పాడాలని అందులో పేర్కొంది. ఇక దేశ ప్రజలంతా ఇందులో పాల్గొనాలని కేంద్రం కోరింది.