News May 4, 2024
కేసీఆర్ ఏ కూటమిలో చేరతారు?: సీఎం రేవంత్

కేసీఆర్ కేంద్రంలోని ఏ కూటమిలో చేరతారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా డిమాండ్ చేశారు. ‘కేసీఆర్ బీజేపీతో కలుస్తారని మేం ముందునుంచీ చెబుతున్నాం. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే. కేసీఆర్ వైఖరిని ప్రజలు ముందే గుర్తించారు. అందుకే వారిని దూరం పెట్టారు. రాష్ట్రానికి బీజేపీ తీరని ద్రోహం చేసింది. ఈ పదేళ్లలో ఆ పార్టీ రాష్ట్రానికి ఒక్క మేలైనా చేసిందా? రాహుల్ను పీఎంగా చూడాలనేదే ప్రజల ఆకాంక్ష’ అని తెలిపారు.
Similar News
News January 17, 2026
₹16 లక్షల కోట్లకు చేరనున్న రిటైల్ వస్త్ర వ్యాపారం

దేశంలో రిటైల్ వస్త్ర వ్యాపారం శరవేగంగా విస్తరిస్తోంది. 2029-30 నాటికి ₹16 లక్షల కోట్లకు విస్తరించనుందని ‘కేర్ ఎడ్జ్’ అంచనా వేసింది. ‘ప్రస్తుతం 9.30 లక్షల కోట్లతో 41% శాతం వాటా రిటైల్ వ్యాపారానిదే. బ్రాండెడ్ దుస్తులకు ప్రాధాన్యం పెరగడం, అంతర్జాతీయ బ్రాండ్ల ప్రవేశంతో మరో 13% పెరగనుంది. టైర్2, 3 పట్టణాల్లో ఈ కామర్స్ సహా, జుడియో, మాక్స్ ఫ్యాషన్, రిలయన్స్ యోస్టా వంటివి వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
News January 17, 2026
పెళ్లి చేసుకుంటే రూ.2లక్షలు.. నేటి నుంచే అమల్లోకి

TG: దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని CM రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన <<18836703>>విషయం<<>> తెలిసిందే. ఇది నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆర్థిక సాయం భార్య పేరున జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో దివ్యాంగ దంపతులకు వివాహానంతరం ఎదురయ్యే ఆర్థిక ఒత్తిళ్లు తగ్గడంతోపాటు, నివాసం, వైద్య ఖర్చులు, జీవనోపాధికి సహాయ పడుతుందని పేర్కొంది.
News January 17, 2026
19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన) ఏప్రిల్ కోటాను ఈనెల 19న TTD విడుదల చేయనుంది. ఈ-డిప్ కోసం 21వ తేదీ 10AM వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు 23న 12PM లోపు డబ్బు చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి. 22న ఆర్జిత సేవ టికెట్లు(కళ్యాణోత్సవం), 23న అంగ ప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్టు టికెట్లు, 24న ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా టికెట్లు విడుదల కానున్నాయి.


