News May 4, 2024
గాడిదతో రేవంత్ గుడ్లు పెట్టిస్తున్నారా?: కిషన్ రెడ్డి

TG: సీఎం రేవంత్ రెడ్డి ‘గాడిద గుడ్డు’ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. ‘రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వలేదని రేవంత్ అసత్యాలు చెబుతున్నారు. ఆయన గాడిదతో గుడ్లు పెట్టిస్తున్నారా? ఫర్టిలైజర్ పరిశ్రమ, RRR, NTPC ప్రాజెక్టులు గాడిద గుడ్లా?’ అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే ఆలోచన తమకు లేదని, ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ఇలాంటి ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.
Similar News
News March 21, 2026
పిల్లి కోసం ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య

హైదరాబాద్లో వేర్వేరు ఘటనల్లో పెంపుడు పిల్లుల కోసం ఇద్దరు విద్యార్థినులు తనువు చాలించడం విస్మయానికి గురిచేస్తోంది. పిల్లిని ఇంట్లోకి తేవొద్దన్నందుకు అల్వాల్కు చెందిన MBBS స్టూడెంట్ శ్రేష్ఠ నిన్న తల్లితో గొడవపడి సూసైడ్ చేసుకుంది. 3 రోజుల క్రితం మీర్పేట్లోనూ BSc విద్యార్థిని హిమబిందు పెంపుడు పిల్లి చనిపోయిందని ఆత్మహత్య చేసుకుంది. పెట్స్పై ప్రేమతో ప్రాణాలు తీసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
News March 21, 2026
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. సిట్ అదుపులో అభిషేక్ సింగ్

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసినట్లు అనుమానిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్ను సిట్ అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. అతని సెల్ ఫోన్ డేటా ఆధారంగా విచారణ జరుగుతోంది. అభిషేక్ నుంచి BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. రోహిత్ రెడ్డికి అతను 24 సార్లు మత్తుపదార్థాలు సరఫరా చేసినట్లు తెలుస్తోంది.
News March 21, 2026
తలసరి ఆదాయంలో రంగారెడ్డి టాప్

TG: ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ ప్రకారం తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా రూ.11,29,735తో టాప్ ప్లేస్లో నిలిచింది. 2,3వ ప్లేస్లో HYD(రూ.4,76,679), సంగారెడ్డి(రూ.3,94,587) ఉన్నాయి. రూ.2,37,809 అత్యల్ప తలసరి ఆదాయంతో హనుమకొండ చివరి స్థానంలో ఉంది. కరవు ప్రాంతంగా ముద్రపడ్డ MBNR రూ.3,36,898తో ఆరో ప్లేస్కు చేరుకోవడం విశేషం. తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ముందుండటం కొసమెరుపు.


