News May 10, 2024

దేశంలో శాకాహారుల శాతం ఎంతంటే?

image

దేశవ్యాప్తంగా 29 శాతం మంది శాకాహారులు ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. అయితే, రాష్ట్రాల వారిగా వీరి సంఖ్య భిన్నంగా ఉంది. దేశంలో అధికంగా రాజస్థాన్‌లో 75శాతం మంది శాకాహారులున్నారు. టాప్-5లో హర్యానాలో 70శాతం, పంజాబ్‌లో 67శాతం, గుజరాత్‌లో 61శాతం, హిమాచల్ ప్రదేశ్ 53శాతం ఉన్నాయి. లక్షద్వీప్‌లో ఒక్కరూ కూడా శాకాహారులు లేకపోవడం గమనార్హం. ఇక TGలో 1.3%, APలో 1.7% మంది మాత్రమే వెజిటేరియన్స్ ఉన్నారు.

Similar News

News April 17, 2026

హార్ముజ్‌ను ఓపెన్ చేసినందుకు థాంక్స్: ట్రంప్

image

హార్ముజ్‌ ఓపెన్ చేస్తున్నట్లు ఇరాన్ చేసిన ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఆ దేశానికి థాంక్స్ చెప్పారు. జలసంధిని ‘స్ట్రెయిట్ ఆఫ్ ఇరాన్’ (ఇరాన్ జలసంధి)గా ట్రంప్ పేర్కొనడం గమనార్హం. ఇన్నాళ్లూ హార్ముజ్‌ను తెరవమని ట్రంప్ ఒత్తిడి చేసినా తలొగ్గని ఇరాన్ లెబనాన్-ఇజ్రాయెల్ సీజ్‌ఫైర్‌తో వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో US-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపైనా ఆశలు చిగురించాయి.

News April 17, 2026

BIG ALERT: రేపు మండే ఎండలు.. పిడుగులతో వర్షాలు

image

AP: వచ్చే రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత, పిడుగులతో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. రేపు 27 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, ప.గోదావరి, ఏలూరు జిల్లాల్లో అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News April 17, 2026

సౌత్ vs నార్త్ అంటూ దేశాన్ని ముక్కలు చేస్తామంటే కుదరదు: షా

image

ఉత్తర, దక్షిణ భేదాలు చూపి దేశాన్ని ముక్కలు చేస్తామంటే కుదరదని కేంద్రమంత్రి అమిత్ షా డీఎంకేని ఉద్దేశించి LSలో వ్యాఖ్యానించారు. ‘డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు. దక్షిణమే కాదు యూటీలకు సైతం దేశంపై అదే హక్కు ఉంటుంది. కరోనా కారణంగా 2021లో జనగణన చేయలేకపోయాం. ఇప్పుడు అందరి సూచనలతో చేస్తున్నాం. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో సీట్లు పెరుగుతాయి’ అని తెలిపారు.