News May 11, 2024

భారత్‌లో మళ్లీ పుంజుకుంటున్న చైనా ఫోన్ల మార్కెట్!

image

2020లో చైనాతో సరిహద్దు వివాదం తర్వాత ఆదరణ కోల్పోయిన ఆ దేశ ఫోన్ బ్రాండ్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. షియోమీ, ఓప్పో, వివో, రియల్‌మీ, ట్రాన్షన్, మోటరోలా మూకుమ్మడి మార్కెట్ షేర్ మార్చి నాటికి 75%కు చేరింది. రూ.25వేలు-50వేల రేంజ్ ఫోన్ల మార్కెట్ షేర్ 18%కు పెరిగింది. కానీ రెవెన్యూ షేర్‌లో చైనా కంపెనీలు వెనకబడ్డాయి. యాపిల్, శాంసంగ్ అందించే ప్రీమియం ఫోన్లపై దృష్టిసారించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

Similar News

News November 5, 2025

OFFICIAL: కమల్ ప్రొడక్షన్‌లో రజినీ సినిమా

image

తమిళ సినీ దిగ్గజాలు రజినీకాంత్, కమల్ హాసన్ ఓ సినిమా కోసం చేతులు కలిపారు. కమల్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో రజినీకాంత్ హీరోగా ఈ మూవీ తెరకెక్కనుంది. దీనికి సి.సుందర్ దర్శకత్వం వహించనున్నారు. సూపర్ స్టార్‌కు 173వ సినిమా ఇది. ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు కమల్ హాసన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

News November 5, 2025

టీటీడీకి రూ.1000 కోట్ల విరాళాలు: బీఆర్ నాయుడు

image

AP: గత ఏడాది కాలంలో TTDకి రూ.1000Cr విరాళాలు వచ్చాయని బోర్డు ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. ఛైర్మన్‌గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘శ్రీవాణి ట్రస్ట్ కింద 5వేల ఆలయాలు నిర్మించాలని తీర్మానించాం. తిరుపతి-తిరుమల మధ్య ఎలక్ట్రికల్ బస్సులు నడపాలని యోచిస్తున్నాం. తిరుపతి విమానాశ్రయానికి శ్రీవెంకటేశ్వర ఎయిర్‌పోర్టుగా నామకరణం చేస్తాం’ అని పేర్కొన్నారు.

News November 5, 2025

షమీకి మరోసారి నిరాశ.. రీఎంట్రీ కష్టమేనా?

image

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి మరోసారి నిరాశ ఎదురైంది. NOV 14 నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్‌కు BCCI ప్రకటించిన <<18208501>>జట్టులో<<>> ఆయనకు చోటు దక్కలేదు. ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్‌కూ ఆయన్ను సెలక్ట్ చేయని సంగతి తెలిసిందే. దీంతో షమీ కెరీర్ ముగిసినట్లేనా అని క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. కాగా ఇటీవల రంజీ ట్రోఫీలో ఆయన 3 మ్యాచుల్లో 15 వికెట్లు పడగొట్టారు.