News May 11, 2024

ఏపీ ఎన్నికల ముఖ చిత్రం ఇదే(3/3)

image

లోక్‌సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది పోటీలో ఉన్నారు. విశాఖ లోక్‌సభలో అత్యధికంగా 33 మంది, రాజమండ్రిలో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తిరుపతి అసెంబ్లీకి అత్యధికంగా 46 మంది, అత్యల్పంగా చోడవరం అసెంబ్లీకి ఆరుగురు పోటీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో 79.84 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈసారి 83 శాతం పోలింగ్‌ జరిగే అవకాశముందని అంచనా.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News March 15, 2026

పర్షియన్ గల్ఫ్‌లో భారత యుద్ధ నౌకలు!

image

భారత నేవీకి చెందిన పలు యుద్ధ నౌకలను ఇరాన్‌కు సమీపంలోని పర్షియన్ గల్ఫ్‌లో మోహరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇండియా వైపు వచ్చే వాణిజ్య నౌకలకు అవసరమైతే సాయం అందించేందుకు అవి అక్కడ సిద్ధంగా ఉన్నాయని చెప్పాయి. మరోవైపు LPG గ్యాస్‌తో వస్తున్న రెండు భారత షిప్‌లు హార్ముజ్ జలసంధి దాటేందుకు ఇరాన్ అధికారులు అనుమతి ఇచ్చారు. అందులోని శివాలిక్ ట్యాంకర్ ఈనెల 21న దేశానికి చేరుకోనుంది.

News March 15, 2026

అభిషేక్, నేను అగ్ని లాంటోళ్లం: సంజు శాంసన్

image

అభిషేక్ శర్మ, తాను ఐస్-ఫైర్‌లా ఉండమని, తాము కలిస్తే అగ్నికి అగ్ని తోడైనట్లేనని సంజూ శాంసన్ అన్నారు. ‘ఓపెనింగ్‌లో కొన్నిసార్లు నేను, ఇంకొన్నిసార్లు అభిషేక్ దూకుడుగా ఆడాం. 2024 నుంచి ఇదే చేస్తున్నాం’ అని ఇండియా టుడే కాంక్లేవ్‌లో చెప్పారు. ఇంతకుముందు అభిషేక్ ఫాలోయింగ్‌ను చూసి అసూయపడేవాళ్లమని పేర్కొన్నారు. జట్టులో అతడో సూపర్ స్టార్ అని, త్వరగా పెళ్లి చేసుకోవాలని జోక్ చేశారు.

News March 15, 2026

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్!

image

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు మరిన్ని సౌకర్యాలను TTD అందుబాటులోకి తీసుకొస్తోంది. వసతి గృహాల్లో దిండు, దుప్పటి, చాప, బెడ్‌షీట్‌లను ఇవ్వనుంది. తొలుత నందకంలో ఇవ్వడం ప్రారంభించగా భక్తుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో వకుళామాత, పాంచజన్యం, కౌస్తుభం తదితర గెస్ట్‌హౌసుల్లోనూ అందజేయాలని నిర్ణయించింది. దుప్పటి-₹10, 2 దిండ్లు-₹10, చాప-₹10, బెడ్‌షీట్‌-₹20 చొప్పున చెల్లించి తీసుకోవచ్చు.