News May 12, 2024
తూ.గో: ‘వీరు ఓటు కోసం 8KM నడవాలి’

రాజవొమ్మంగి మండలం లోదొడ్డి పంచాయతీ కిండంగి గ్రామానికి చెందిన గిరిజనులు ఓటు వేయాలంటే 8 కి.మీ నడవాల్సి ఉంటుంది. కొండపైన ఉన్న ఈ గ్రామంలో మొత్తం 51 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 27 మంది పురుషులు ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు 4 కి.మీ దూరంలో ఉన్న లోదొడ్డి గ్రామానికి వచ్చి తిరిగి వారి గ్రామానికి వెళ్ళాలి. మొత్తం 8కిమీ నడక తప్పదని గ్రామస్తులు తెలిపారు.
Similar News
News March 25, 2026
రాజమండ్రి చేరుకున్న వి.ఎల్.కాంతారావు

పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన కోసం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వి.ఎల్.కాంతారావు బుధవారం రాజమండ్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఉన్నతాధికారులు, జిల్లా పరిపాలనా అధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పురోగతిపై కాంతారావు అధికారులతో చర్చించనున్నారు.
News March 24, 2026
కొవ్వూరు: విద్యుత్ తీగలపైనే కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి

కొవ్వూరు సమీపంలోని నందమూరులో విద్యుత్ పనులు చేస్తూ శ్రీకాంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మరమ్మతులు జరుగుతుండగానే విద్యుత్ సరఫరా ఇవ్వడంతో ఆయన తీగలపైనే ప్రాణాలు కోల్పోయారు. రెగ్యులర్ ఉద్యోగులకు బదులు కాంట్రాక్ట్ సిబ్బందిని ప్రమాదకర పనులకు పంపడమే ఈ ఘోరానికి కారణమని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు.
News March 24, 2026
కొవ్వూరు: విద్యుత్ తీగలపైనే కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి

కొవ్వూరు సమీపంలోని నందమూరులో విద్యుత్ పనులు చేస్తూ శ్రీకాంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మరమ్మతులు జరుగుతుండగానే విద్యుత్ సరఫరా ఇవ్వడంతో ఆయన తీగలపైనే ప్రాణాలు కోల్పోయారు. రెగ్యులర్ ఉద్యోగులకు బదులు కాంట్రాక్ట్ సిబ్బందిని ప్రమాదకర పనులకు పంపడమే ఈ ఘోరానికి కారణమని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు.


