News May 13, 2024

అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు: డీజీపీ

image

TG: రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని డీజీపీ రవిగుప్తా తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నట్లు చెప్పారు. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. పోలింగ్ చివరి మూడు గంటలు అలర్ట్‌గా ఉంటామని పేర్కొన్నారు.

Similar News

News February 12, 2026

ఉప్పుతో పిల్లలకు ముప్పు.. తస్మాత్ జాగ్రత్త!

image

చిన్న పిల్లల ఆహారంలో అదనంగా ఉప్పు చేర్చడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఏడాదిలోపు పిల్లల కిడ్నీలు సున్నితంగా ఉండటం వల్ల ఉప్పును తట్టుకోలేవు. తల్లి పాలతో పాటు సహజ ఆహారంలో ఉండే సోడియం వారికి సరిపోతుంది. చిన్నప్పుడే ఉప్పు అలవాటు చేస్తే పెద్దయ్యాక BP, గుండె సమస్యలు రావొచ్చు. చిరుతిళ్లకు బదులు పండ్లు, కూరగాయలు అలవాటు చేస్తూ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోండి’ అని సూచిస్తున్నారు.

News February 12, 2026

ఢిల్లీలో TG CM రేవంత్ మీడియా చిట్ చాట్

image

* ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనేది నా వ్యక్తిగత డిమాండ్.. ఆయన జాతి సంపద
* ఈ ఫార్ములా కేసులో కేటీఆర్‌ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదో కిషన్ రెడ్డి చెప్పాలి
* ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంలో ఓటుకు నోటు కేసు ఆధారాలేవీ తగలబడలేదు
* శంషాబాద్ ఎయిర్‌పోర్టు పక్కన బుల్లెట్ ట్రైన్ స్టేషన్ నిర్మించాలని కేంద్రాన్ని కోరా.. అందుకు 600 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాం.

News February 12, 2026

ఇషాన్ విధ్వంసం.. వరుసగా 6, 6, 6, 6, 4

image

టీ20 WCలో నమీబియాతో మ్యాచులో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేశారు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. స్మిత్ వేసిన ఆరో ఓవర్లో ఇషాన్ వరుసగా 6, 6, 6, 6, 4 బాదారు. 6 ఓవర్లకు భారత్ స్కోర్ 86-1.