News May 14, 2024

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్న కేంద్రం!

image

కుటుంబమంతా కలిసి చూసే విలువలతో కూడిన కంటెంట్‌ను అందించడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానుందట. భారతీయ సమాజం, సంస్కృతీ సంప్రదాయాలను చూపించడమే లక్ష్యంగా ఇందులోని కంటెంట్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వినోదంతో పాటు కరెంట్ అఫైర్స్‌ను ఇందులో కవర్ చేస్తారట. ఏడాది లేదా రెండేళ్లు ఉచితంగా సేవలు అందించి, ఆ తర్వాత సబ్‌స్క్రిప్షన్ ధరలు నిర్ణయిస్తారని సమాచారం.

Similar News

News March 28, 2026

BREAKING: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,510 పెరిగి రూ.1,48,090కు చేరింది. రెండు రోజుల్లోనే రూ.3,540 పెరగడం గమనార్హం. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,300 ఎగబాకి రూ.1,35,750 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు పెరిగి రూ.2,50,000గా ఉంది.

News March 28, 2026

ఆయిల్ పామ్ తోటల్లో పచ్చిరొట్ట ఎరువులతో ప్రయోజనం

image

పచ్చిరొట్ట ఎరువులు పంటలకు మేలు చేస్తాయి. ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయసు గల ఆయిల్ పామ్ మొక్కల పాదులలో మూడు అడుగుల దూరములో జనుమువేసి, పూతదశ వరకు పెంచిన తర్వాత దానిని చిన్నచిన్న ముక్కలుగా చేసి పాదులలో వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల నీటి వృథా అరికట్టటమే కాకుండా నేలలో సేంద్రియ పదార్థాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. దీని వలన కలుపు మొక్కల బెడద తగ్గుతుంది.

News March 28, 2026

పాండ్య ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇచ్చారా?

image

ముంబైలోని వాంఖడే స్టేడియం సిబ్బందికి హార్దిక్ పాండ్య రివార్డు ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక్కొక్కరికి రూ.10 లక్షలు అందజేసినట్లు ప్రచారం జరిగింది. అదంతా అబద్ధమని ఒక్కొక్కరికి రూ.10వేల చెక్కు ఇచ్చారని నేషనల్ మీడియా క్లారిటీ ఇచ్చింది. కాగా టీ20 ప్రపంచకప్ కోసం పాండ్య వాంఖడే స్టేడియంలో అర్ధరాత్రి వరకు ప్రాక్టీస్ చేశారు. తనకు సహకరించిన గ్రౌండ్ స్టాఫ్‌కు రివార్డు ఇస్తానని అప్పుడే మాట ఇచ్చారు.