News May 14, 2024

ఇండోనేషియాలో వరదలు.. 50 మంది మృతి

image

ఇండోనేషియాలోని పశ్చిమ సుమాత్ర ప్రావిన్స్‌లో సంభవించిన వరదలకు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. కుండపోత వర్షాలు, మరాపీ అగ్నిపర్వతం తాలూకు కొండచరియలు విరిగిపడటంతో నదులు ఉప్పొంగినట్లు అధికారులు వెల్లడించారు. వరదల ధాటికి అనేక ఇళ్లు ధ్వంసం కాగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. కాగా గల్లంతైన 27 మంది ఆచూకీ కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు.

Similar News

News March 19, 2026

వరిలో సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని ఎలా గుర్తించాలి?

image

వరి పంట అక్కడక్కడ గుంపులు గుంపులుగా పసుపు వర్ణంలోకి మారి ఎండిపోతోంది. సల్ఫైడ్ (గంధకం) దుష్ప్రభావమే దీనికి కారణం. సల్ఫైడ్ దుష్ప్రభావమున్న నేల బాగా మెత్తగా ఉండి, పొలంలో నడుస్తుంటే కాలు చాలా లోతుగా దిగబడి, గాలి బుడగల రూపంలో గాలి బయటకు వస్తుంది. నేల నుంచి దుర్వాసన రావడంతో పాటు మొక్కను వేర్లతో బయటకు తీస్తే కుళ్లిన కోడిగుడ్ల వాసన వస్తుంది. ఈ సమస్య తీవ్రమైతే మొక్కలు పూర్తిగా చనిపోయే అవకాశం ఉంది.

News March 19, 2026

వారికి ఉచితంగా బిందు సేద్య పరికరాలు

image

APలోని 8 జిల్లాల్లో FRA(ఫారెస్ట్ రైట్స్ యాక్ట్) పట్టాదారులకు 100% రాయితీపై బిందు, 90% రాయితీతో తుంపర సేద్యం పరికరాలను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో అల్లూరి, ఏలూరు, మన్యం, నంద్యాల, పల్నాడు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని 2.30 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని తెలిపింది. ధర్తీ ఆబా జన్‌జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ కింద ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొంది.

News March 19, 2026

కవిత కొత్త పార్టీ.. పేరు ఇదే

image

TG: జాగృతి చీఫ్ కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఆమె జనవరి 23నే దరఖాస్తు చేశారు. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం త్వరగా పరిశీలించి నిర్ణయం వెలువరించేలా ఆదేశాలివ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే దరఖాస్తులో లోపాలున్నాయని ECI తరఫు న్యాయవాది FEB 27న న్యాయస్థానానికి తెలిపారు. ఈ అంశంపై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది.