News May 14, 2024

పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు

image

AP: పల్నాడు జిల్లా కొత్తగణేషునిపాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న కొందరు YCP కార్యకర్తల ఇళ్లను TDP నేతలు కూల్చేశారు. దీంతో మహిళలు రాత్రంతా గుడిలో తలదాచుకున్నారు. అటు తమ శ్రేణులను పరామర్శించేందుకు వెళ్లిన గురజాల MLA కాసు మహేశ్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్‌ కాన్వాయ్‌పై కొందరు TDP కార్యకర్తలు రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

Similar News

News March 22, 2026

రేపే మిట్టల్ ప్లాంట్‌కు శంకుస్థాపన

image

AP: అనకాపల్లి(D) నక్కపల్లి(M)లో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ కంపెనీలు ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్‌కు CM చంద్రబాబు రేపు శంకుస్థాపన చేస్తారు. రూ.1,47,162CR పెట్టుబడితో నిర్మించే ఈ ప్లాంట్ వల్ల 60-65వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. మొదటి దశలో 7.3MT, రెండో దశలో 10.5MT ఉత్పత్తి.. 2033 నాటికి ప్లాంట్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది.

News March 22, 2026

కాఫీ ఇలా తాగితే ఆరోగ్యం పక్కా!

image

చాలామంది కాఫీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని భయపడతారు. కానీ ఫిల్టర్ చేసిన బ్లాక్ కాఫీ లివర్, గట్ హెల్త్‌కు చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. నిద్రలేచిన 60 నుంచి 90 నిమిషాల తర్వాత తాగడం బెస్ట్ టైమ్. రోజుకు 1-3 కప్పుల వరకు ఓకే. చక్కెర కలపకుండా తాగడం ముఖ్యం. అలాగే ఖాళీ కడుపుతో తాగొద్దు. ఆర్గానిక్ కాఫీ గింజలైతే బ్రెయిన్ షార్ప్‌గా ఉండటమే కాకుండా అల్జీమర్స్ వంటి రిస్కులు తగ్గుతాయి.

News March 22, 2026

నేడే రైతు భరోసా నిధుల విడుదల

image

TG: రాష్ట్ర ప్రభుత్వం నేడు రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. తొలి విడతలో ఒక ఎకరం భూమి వరకు రూ.6,000 చొప్పున మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ₹3,590 కోట్లు చేరనున్నాయి. మరో 20 రోజుల తర్వాత రెండో విడతగా ₹2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత నిధులు జమ కానున్నాయి.