News January 10, 2025
దేశంలో లాక్డౌన్ అంటూ ప్రచారం.. స్పందించిన PIB
దేశంలో hMPV వ్యాప్తిని నిరోధించడానికి కేంద్రం లాక్డౌన్ విధించిందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సైతం ‘లాక్డౌన్’ థంబ్నెయిల్స్తో అసత్యపు ప్రచారం చేస్తుండటంతో కేంద్రానికి చెందిన PIB FACTCHECK స్పందించింది. ఇలాంటివి నమ్మి ఆందోళన చెందొద్దని, కేంద్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే వరకూ ఏదీ నమ్మొద్దని తెలిపింది.
Similar News
News January 18, 2025
వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ ప్రచారం అవాస్తవం: డిస్కంలు
APCPDCL పరిధిలో వ్యవసాయానికి 7 గంటలు మాత్రమే ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతోందని వస్తున్న వార్తలను డిస్కంలు ఖండించాయి. పొగ మంచు కారణంగా సౌర విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడటంతో రెండు రోజులుగా కరెంటు సరఫరా సమయాన్ని రీషెడ్యూల్ చేశామని తెలిపాయి. నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ సరఫరా జరుగుతోందని స్పష్టం చేశాయి. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.
News January 18, 2025
గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం
TG: రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. జాబితాలో పేరు లేనివారు ఆందోళన చెందొద్దని, గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కులగణన ఆధారంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ కార్డు ఇస్తామని స్పష్టం చేశారు. ఇక పాత రేషన్ కార్డులు తొలగిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపైనా ఉత్తమ్ స్పందించారు. అలాంటిదేమీ ఉండదని, పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేరుస్తామని చెప్పారు.
News January 18, 2025
అతనొక్కడే దోషి కాదు.. ట్రైనీ డాక్టర్ తల్లి
కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సంజయ్ రాయ్ని కోర్టు దోషిగా తేల్చడంపై బాధితురాలి తల్లి హర్షం వ్యక్తం చేశారు. కానీ ఈ దారుణం వెనుక మరికొందరు ఉన్నారని ఆమె ఆరోపించారు. వారికి కూడా శిక్ష పడ్డప్పుడే న్యాయం జరిగినట్లు భావిస్తామన్నారు. అప్పటివరకు తాము ప్రశాంతంగా నిద్రపోలేమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ కేసులో ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు.