News May 24, 2024
ఎన్నికల కేసుల్లో నిందితులైన నేతలకు ఊరట

AP: ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల్లో నిందితులుగా YCP MLAలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, TDP నేతలు చింతమనేని ప్రభాకర్, అస్మిత్రెడ్డిలను జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జూన్ 4న కౌంటింగ్ ఉన్నందున అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలన్న పిటిషనర్ల అభ్యర్థనతో న్యాయస్థానం ఏకీభవించింది. వీరి కదలికలపై పోలీసులతో నిఘా ఉంచాలని ఈసీని కోర్టు ఆదేశించింది.
Similar News
News April 18, 2026
అప్పుడు మహిళలే బిల్లును వ్యతిరేకించారు.. ఎందుకంటే?

మహిళా రిజర్వేషన్లు బిల్లును ఒకప్పుడు మహిళలే వ్యతిరేకించారని తెలుసా? రాజ్యాంగ సభలో భాగమైన రేణుకా రే సహా పలువురు మహిళలు రిజర్వేషన్ వద్దనే వాదనను బలంగా వినిపించారు. అలా చేస్తే మహిళా ప్రాతినిధ్యం కొన్ని సీట్లకే పరిమితం అవుతుందని, జనరల్ సీట్లలో ప్రాధాన్యం తగ్గుతుందని 1947 జులై 18న జరిగిన సభలో పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత కాలంలో నెలకొన్న పరిస్థితులు వారి అంచనాలకు భిన్నంగా మారాయి.
News April 18, 2026
NEET అభ్యర్థులకు అలర్ట్

వైద్య కోర్సుల్లో అడ్మిషన్లకు మే 3న దేశవ్యాప్తంగా NEET UG-2026 జరగనుంది. 2PM నుంచి 5PM వరకు పెన్ అండ్ పేపర్ పద్ధతిలో ఈ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. విద్యార్థులు తప్పనిసరిగా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తెచ్చుకోవాలని, లేదంటే అనుమతించబోమని NTA తెలిపింది. ఫుల్ స్లీవ్స్ ధరించవద్దని, లైట్, సింపుల్గా ఉండే డ్రెస్సులు వేసుకోవాలని సూచించింది. వాచ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని పేర్కొంది.
News April 18, 2026
త్వరలోనే భూముల ధరల పెంపు: పొంగులేటి

TG: రాష్ట్రంలో త్వరలోనే భూముల ధరలను పెంచుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయంపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని మీడియా చిట్చాట్లో చెప్పారు. ధరణితో ఏర్పడిన సమస్యలు భూభారతితో పరిష్కారమవుతాయన్నారు. అలాగే రెవెన్యూ శాఖలోనూ కొత్త పాలసీ తీసుకొస్తామని పేర్కొన్నారు. భూముల మార్కెట్ విలువను 20 శాతం మేర పెంచాలని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఇటీవల <<19616990>>ప్రభుత్వానికి<<>> సిఫారసు చేసింది.


