News May 24, 2024

కౌంటింగ్ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్: సీఈవో ముకేశ్

image

AP: వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల అధికారులను CEO ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి కౌంటింగ్ కేంద్రాలకు EVMలను తరలించడానికి ఒకవైపు, అభ్యర్థులు, ఏజెంట్లకు మరోవైపు మార్గం ఉండాలని సూచించారు. ఆ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్‌తో కంప్యూటర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వేగంగా డేటా ఎంట్రీ చేసేందుకు నిపుణులైన సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు.

Similar News

News November 3, 2025

‘పుల్లోరం’ కోడి పిల్లలకు ప్రమాదం

image

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.

News November 3, 2025

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

image

AP: బాపట్లలోని సత్యవతిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి కారు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మరణించిన వారు బాపట్ల MLA నరేంద్ర వర్మ బంధువులని సమాచారం. ఎమ్మెల్యే కుమారుడి సంగీత్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను కర్లపాలెం గ్రామానికి చెందిన పుష్పవతి(60), శ్రీనివాసరాజు(54), బలరామరాజు(65), లక్ష్మి(60)గా గుర్తించారు.

News November 3, 2025

డ్రాగన్ ఫ్రూట్‌తో మహిళలకు ఎన్నో లాభాలు

image

కలర్‌ఫుల్‌గా కనిపించే డ్రాగన్‌ ఫ్రూట్‌‌లో అనేక పోషకాలుంటాయి. ఇవి మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. మహిళల్లో ఐరన్, ఫోలేట్, విటమిన్ సి లోపాన్ని భర్తీ చేస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్‌ సమయంలో ఆస్టియో పోరోసిస్‌ ప్రమాదం ఎక్కువ. డ్రాగన్‌ ఫ్రూట్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే మెగ్నీషియం, క్యాల్షియం అంది ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే శరీరంలో కొల్లాజెన్‌ ఉత్పత్తి పెంచుతుందని చెబుతున్నారు.