News May 24, 2024
ఇంటర్నేషనల్ కిడ్నీ రాకెట్లో HYD వైద్యుడు

కేరళలో బయటపడ్డ ఇంటర్నేషనల్ కిడ్నీ రాకెట్ సూత్రధారి HYD వైద్యుడని ఆ రాష్ట్ర పోలీసులు గుర్తించారు. అతడి పేరును వెల్లడించలేదు. ఇప్పటి వరకు బెంగళూరు, హైదరాబాద్కు చెందిన 40 మంది పేద యువకులను ఇరాన్ తీసుకెళ్లి కిడ్నీలు విక్రయించినట్లు తెలిపారు. ₹20 లక్షలు ఇస్తామని చెప్పి ₹6 లక్షలే ముట్టజెబుతున్నారన్నారు. ముఠా సభ్యుల్లో ఒకరైన సబిత్ను అరెస్టు చేసి ప్రశ్నించడంతో వివరాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు.
Similar News
News January 8, 2026
భారీ జీతంతో నీతిఆయోగ్లో ఉద్యోగాలు

<
News January 8, 2026
రూ.26.30 కోట్ల ఫ్లాట్ కొన్న రోహిత్ భార్య

రోహిత్ శర్మ భార్య రితికా ముంబైలోని ప్రభాదేవీ ప్రాంతంలో రూ.26.30 కోట్ల ఫ్లాట్ను కొనుగోలు చేశారు. దీని విస్తీర్ణం 2,760sq ft. స్టాంప్ డ్యూటీ కింద రూ.1.31 కోట్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.30వేలు చెల్లించారు. ప్రస్తుతం హిట్మ్యాన్ దంపతులు నివాసం ఉంటున్న లగ్జరీ అహూజా టవర్స్లోనే ఈ ఫ్లాట్ ఉంది. రోహిత్ దంపతులు కొన్నేళ్లుగా రియల్ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న విషయం తెలిసిందే.
News January 8, 2026
ఒత్తిడి పెరిగితే అందం తగ్గిపోతుంది

ఒత్తిడికి ఎక్కువగా గురయ్యే మహిళలు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ సైన్స్ అండ్ రీసర్చ్ ప్రచురించిన నివేదికలో పేర్కొన్నారు. ఒత్తిడి వల్ల వృద్ధాప్య ఛాయలు ముందే రావడంతో పాటు నెలసరి సమస్యలు, బీపీ, షుగర్ వంటివి దాడి చేస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి సరిపడా నీరు, నిద్ర, పోషకాలున్న ఆహారం, వ్యాయామాలు, ధ్యానం ఉపయోగపడతాయని చెబుతున్నారు.


