News May 24, 2024

ఇంటర్నేషనల్ కిడ్నీ రాకెట్‌లో HYD వైద్యుడు

image

కేరళలో బయటపడ్డ ఇంటర్నేషనల్ కిడ్నీ రాకెట్ సూత్రధారి HYD వైద్యుడని ఆ రాష్ట్ర పోలీసులు గుర్తించారు. అతడి పేరును వెల్లడించలేదు. ఇప్పటి వరకు బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన 40 మంది పేద యువకులను ఇరాన్ తీసుకెళ్లి కిడ్నీలు విక్రయించినట్లు తెలిపారు. ₹20 లక్షలు ఇస్తామని చెప్పి ₹6 లక్షలే ముట్టజెబుతున్నారన్నారు. ముఠా సభ్యుల్లో ఒకరైన సబిత్‌ను అరెస్టు చేసి ప్రశ్నించడంతో వివరాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు.

Similar News

News February 7, 2025

ITలో అతిపెద్ద IPO.. 12న హెక్సావేర్ పబ్లిక్ ఇష్యూ

image

ఐటీ సంస్థ హెక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ రూ.8,750 కోట్ల సేకరణకు సిద్ధమైంది. ఈ నెల 12 నుంచి 14 వరకు ఐపీవో కొనసాగనుంది. బ్రాండ్ ధరను రూ.674-రూ.708గా ఫిక్స్ చేసింది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఒక రోజు ముందుగానే సబ్‌స్క్రిప్షన్ అందుబాటులోకి రానుంది. ఐటీ సెక్టార్‌లో ఇదే అతిపెద్ద ఐపీవో కావడం విశేషం. 20 ఏళ్ల కిందట TCS రూ.4,700 కోట్లు సమీకరించింది.

News February 7, 2025

మే, జూన్ నెలల్లో 2 పథకాల అమలు: మంత్రి కొలుసు

image

AP: తాము అధికారంలోకి వచ్చాక ఉచిత సిలిండర్లు, అన్న క్యాంటీన్లు అమలు చేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. తల్లికి వందనం(విద్యార్థికి ₹15K), అన్నదాత సుఖీభవ(రైతుకు ₹20K) పథకాలను మే, జూన్ నెలల్లో అమలు చేస్తామని ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం ప్రారంభిస్తామని CM CBN సైతం వెల్లడించారు. అన్నదాత సుఖీభవను 3 విడతలుగా అందిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

News February 7, 2025

గాజా స్వాధీనంపై ట్రంప్‌ది గొప్ప ఆలోచన: నెతన్యాహు

image

గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని US అధ్యక్షుడు ట్రంప్ చేసిన <<15364652>>వ్యాఖ్యలను<<>> ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమర్థించారు. ఆయన చేసిన ప్రతిపాదనలో తప్పు లేదని, గొప్ప ఆలోచన అని చెప్పారు. నిజంగా అది అమల్లోకి వస్తే గాజా ప్రజలకు భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. కాగా గాజా నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని ట్రంప్ చేసిన ప్రతిపాదనను అరబ్ దేశాలు ఖండించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!