News May 25, 2024

టూర్లకు బై.. కౌంటింగ్‌పై అభ్యర్థుల దృష్టి

image

AP: ఈ నెల 13న పోలింగ్ తర్వాత సేదతీరడానికి దేశ, విదేశాలకు వెళ్లిన అభ్యర్థులు క్రమంగా నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు. పార్టీల అగ్రనాయకత్వం ఆదేశాలతో కౌంటింగ్ ప్రక్రియపై దృష్టిసారించారు. మండల స్థాయి నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలో అనుసరించాల్సిన నిబంధనలు, చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేస్తున్నారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఏజెంట్లకు సూచిస్తున్నారు.

Similar News

News April 17, 2026

మహబూబ్‌నగర్‌లో ఈ నెల 18న ఉద్యోగ మేళా

image

మహబూబ్‌నగర్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 18న ఉదయం 10:30 గంటలకు ఎంప్లాయ్మెంట్ ఎక్సైజ్ పిల్లలమర్రి రోడ్డులో ఉద్యోగమేళా నిర్వహించనున్నారు. 10వ తరగతి ఆపై చదివిన 18-30 ఏళ్ల యువత 6 ప్రైవేట్ సంస్థల్లో 250 ఖాళీల భర్తీకి అర్హులని జిల్లా ఉపాధి కల్పన అధికారి మైత్రి ప్రియ తెలిపారు. ఆసక్తి గలవారు సర్టిఫికెట్లు, బయోడేటాతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు 8919380410 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

News April 17, 2026

పరుచూరి చెప్పిన జీవిత సూత్రం!

image

అతి మంచితనం, మొహమాటంతో ‘నో’ చెప్పలేకపోవడం వల్ల జీవితంలో అనేక చిక్కులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఇతరులకు మాటిచ్చి ఇబ్బందుల్లో పడేవారు చాలామంది. దీనిపై రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరికైనా మాట ఇచ్చేముందు పదిసార్లు ఆలోచించాలి. నోరు విప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సమయానుకూలంగా NO చెప్పడం నేర్చుకోండి’ అని ఆయన సూచించారు.

News April 17, 2026

దేవుడి కంటే BCCI వద్దే ఎక్కువ డబ్బు.. అయినా: లలిత్ మోదీ

image

భారత్‌లో ఉన్న స్టేడియాలపై IPL ఫౌండర్ లలిత్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. BCCI వద్ద దేవుడి కంటే ఎక్కువ డబ్బు ఉందని, అయినా స్టేడియాల దుస్థితి మారట్లేదని ఓ పాడ్‌కాస్ట్‌లో అన్నారు. BCCI వాటిని కూల్చేసి కొత్తవి నిర్మించాలని తెలిపారు. ఇక 2030 నాటికి IPLలో ఒక్కో అగ్రశ్రేణి ఆటగాడు రూ.150CR వరకు సంపాదిస్తారని జోస్యం చెప్పారు. భవిష్యత్తులో ఆటగాళ్లు దేశ జట్టు కంటే IPLకే ప్రాధాన్యతనిస్తారన్నారు.