News May 31, 2024
రూ.లక్ష కోట్ల పెట్టుబడులకు వాహన తయారీ సంస్థలు సిద్ధం
FY24లో రికార్డు స్థాయిలో 4.23 మిలియన్ల ప్యాసింజర్స్ వెహికల్స్ అమ్మకాలతో ప్రముఖ తయారీ సంస్థలకు మంచి ప్రోత్సాహం లభించింది. మారుతీ, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, JSW-MG లాంటి సంస్థలు FY25లో రూ.లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. EVలలో టెక్నాలజీ అభివృద్ధి, కొత్త ప్లాంట్ల నిర్మాణం, నూతన SUVల ఆవిష్కరణపై దృష్టి సారించనున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News October 16, 2024
ఒక్క సినిమాకు రూ.125 కోట్లు తీసుకున్న స్టార్ హీరో!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘వేట్టయన్’ సినిమాకు ఇప్పటికే రూ.264.31 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ చిత్రం కోసం రజినీ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలిపాయి. ఆయన ఏకంగా రూ.125 కోట్లు ఛార్జ్ చేశారట. జడ్జిగా నటించిన అమితాబ్ రూ.7 కోట్లు, రజినీ భార్యగా నటించిన మంజూ వారియర్ రూ.2-3 కోట్లు, ఫహాద్ ఫాజిల్ రూ.2-4 కోట్లు, రానా రూ.5 కోట్లు ఛార్జ్ చేశారని తెలిపాయి.
News October 16, 2024
BREAKING: సజ్జలకు పోలీసుల నోటీసులు
AP: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో రేపు విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు.
News October 16, 2024
J&K మంత్రివర్గంలో చేరట్లేదు: కాంగ్రెస్
జమ్మూకశ్మీర్ సీఎంగా ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో JKPCC చీఫ్ తారిక్ హమీద్ కర్రా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ప్రస్తుతానికి J&K ప్రభుత్వ మంత్రివర్గంలో చేరట్లేదని చెప్పారు. రాష్ట్ర హోదా పునరుద్ధరించాలనే డిమాండ్కు తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దీని కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రసంగంలో ప్రధాని ఇదే హామీని ఇచ్చారని గుర్తు చేశారు.