News January 20, 2025
Stock Markets: ఉరకలెత్తిన సూచీలు

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, బ్యాంకు, ఫైనాన్స్ స్టాక్స్ అండతో దేశీయ స్టాక్మార్కెట్లు నేడు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 77,073 (+454), నిఫ్టీ 23,344 (+141) వద్ద ముగిశాయి. మీడియా, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎగిశాయి. ఆటో షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ కొనసాగింది. కొటక్ బ్యాంకు, విప్రో, బజాజ్ ట్విన్స్, NTPC టాప్ గెయినర్స్. SBI లైఫ్, TRENT, శ్రీరామ్ ఫైనాన్స్, HDFC లైఫ్, అదానీ SEZ టాప్ లూజర్స్.
Similar News
News February 18, 2025
సివిల్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు

సివిల్స్ అభ్యర్థులకు యూపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తుల గడువు మరోసారి పొడిగించింది. ఈ నెల 21 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. వాస్తవానికి ఫిబ్రవరి 11తోనే ముగియగా ఇవాళ్టి వరకు పొడిగించింది. తాజాగా మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్లికేషన్లలో పొరపాట్ల సవరణకు ఫిబ్రవరి 22-28 వరకు అవకాశం ఇచ్చింది. కాగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష మే 25న జరగనుంది.
News February 18, 2025
శామ్సంగ్ S24 Ultra ధర ₹70,000.. ఎక్కడంటే?

మొబైల్ ఫోన్ల ధరలను పోల్చినప్పుడు ఇండియాలో ఎక్కువగా ఉండటంపై వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వివిధ కంపెనీల ఫోన్ల ధరలు దుబాయ్లో తక్కువగా ఉంటాయంటారు. SAMSUNG కంపెనీకి చెందిన S24 Ultra (12/256 GB) ఫోన్ దుబాయ్లో సుమారు ₹70,000లకే లభిస్తుంది. అదే ఇండియాలో ₹1,04,999 (ఆన్లైన్ షాపింగ్ సైట్). దాదాపు ట్యాక్సుల రూపంలో ₹35,000 అధికంగా వసూలు చేయడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి.
News February 18, 2025
టెన్త్తో భారీగా ఉద్యోగాలు.. మరో నాలుగు రోజులే గడువు

రైల్వేలో 32,438 గ్రూప్-డీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. టెన్త్ పాస్ లేదా ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులు. రిజర్వేషన్ను బట్టి వయో సడలింపు ఉంది. CBT, ఫిజికల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
సైట్: https://www.rrbapply.gov.in/