News June 1, 2024
విద్యాశాఖ కొత్త కార్యక్రమం.. ఇకపై విద్యార్థుల ఇళ్లకు టీచర్లు!
AP: 2024-25 విద్యాసంవత్సరం నుంచి స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ‘పేరెంట్ టీచర్-హోం విజిట్’ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందులో భాగంగా టీచర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. జూన్లో ఒకసారి, జనవరిలో మరోసారి పేరెంట్స్కు అనుకూలమైన వేళల్లో వారి ఇళ్లను సందర్శించాలి. విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచేందుకు సిద్ధం చేసిన ప్రణాళిక, బోధన తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించాలి.
Similar News
News October 13, 2024
సీఐడీ చేతికి మరో 2 కేసులు అప్పగింత
AP: మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, చంద్రబాబు నివాసంపై దాడి కేసును సీఐడీకి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ కేసులు మంగళగిరి, తాడేపల్లి పీఎస్ల పరిధిలో ఉన్నాయి. విచారణ వేగవంతం కోసం ఈ నిర్ణయం తీసుకోగా, ఆయా ఫైళ్లను సీఐడీకి మంగళగిరి డీఎస్పీ రేపు అప్పగించనున్నారు.
News October 13, 2024
క్రిశాంక్కు మెయిన్హార్ట్ సంస్థ నోటీసులు
TG: BRS నేత మన్నె క్రిశాంక్కు సింగపూర్కు చెందిన మెయిన్హార్ట్ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. మూసీ ప్రాజెక్టు కన్సల్టెన్సీ విషయంలో తమ కంపెనీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ఆరోపణలు చేయడంపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అటు తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గనని, నోటీసులపై KTR, బీఆర్ఎస్ లీగల్ సెల్తో చర్చిస్తున్నట్లు క్రిశాంక్ బదులిచ్చారు.
News October 13, 2024
రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు
AP: రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీంతో ఈ నెల 14 నుంచి 16 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఏలూరు, పశ్చిమగోదావరి, పల్నాడు, ప్రకాశం, సత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేసింది.