News June 3, 2024
ఎన్నికలు ముగిశాయి.. బాదుడు మొదలైంది: సీతారాం ఏచూరి
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ముగియడంతో మళ్లీ బాదుడు మొదలైందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ‘ఎప్పటిలాగే ఎన్నికలు ముగియగానే మోదీ ప్రభుత్వం ప్రజలను లూటీ చేయడం ప్రారంభించింది. అందులో భాగంగానే అమూల్ పాల ధర లీటరుకు రూ.2, టోల్ ఛార్జీల పెంపు సగటున 5 శాతం పెంచింది. ఇది రవాణా ఛార్జీలపై తీవ్ర ప్రభావం చూపనుంది’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News October 10, 2024
రాష్ట్రంలో 604 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు
AP: KGBVల్లో 604 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 13 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీచర్ జాబ్లు 507, నాన్-టీచింగ్ ఉద్యోగాలు 97 ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, PG, బీఈడీ, యూజీడీపీఈడీ, బీపీఈడీ ఉత్తీర్ణులై, 18-42 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్ను బట్టి సడలింపు ఉంటుంది.
వెబ్సైట్: https://apkgbv.apcfss.in/
News October 10, 2024
25 నుంచి మంత్రి లోకేశ్ అమెరికా పర్యటన
AP: మంత్రి నారా లోకేశ్ ఈ నెల 25 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగే 9వ ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను ప్రముఖ కంపెనీల ప్రతినిధులకు వివరించనున్నారు.
News October 10, 2024
ఎంతమంది ఆప్తులయ్యా నీకు టాటా..!
మనం లోకాన్ని వీడిన రోజున ఆర్తిగా కన్నీరు పెట్టే నలుగురు లేనప్పుడు ఎంత ఆస్తి ఉన్నా నిరుపయోగమేనంటారు విజ్ఞులు. ఈ విషయంలో రతన్ టాటా కచ్చితంగా శ్రీమంతుడే. ఆస్తిపరంగానే కాక ఆత్మీయుల విషయంలోనూ కుబేరుడే. ఆయన మరణ వార్త తెలిసినప్పటి నుంచీ సోషల్ మీడియా, వాట్సాప్లో అన్నింటా ఆయన ఫొటోలే. అందరూ ఆయన గొప్పదనాన్ని తలచుకుంటున్నవారే. ఏదో తమ కుటుంబీకుడినే కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నవారే.