News June 4, 2024

పురందీశ్వరికి లక్ష దాటిన మెజార్టీ

image

AP: రాజమండ్రి ఎంపీ స్థానంలో పురందీశ్వరి లక్ష ఓట్ల మెజార్టీని దాటారు. ప్రస్తుతం 1,15,566 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అనకాపల్లిలో సీఎం రమేశ్(BJP) 32 వేలు, నర్సాపురంలో శ్రీనివాసవర్మ(BJP) 58 వేల ఓట్ల లీడింగులో ఉన్నారు. ఇక కాకినాడలో జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్‌కు 32,241, మచిలీపట్నంలో బాలశౌరి(జనసేన) 25,364 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

Similar News

News September 9, 2025

సియాచిన్‌లో ప్రమాదం.. ముగ్గురు సైనికుల మృతి

image

లద్దాక్‌లోని సియాచిన్ సెక్టార్‌ బేస్ క్యాంపులో విషాదం జరిగింది. డ్యూటీలో ఉన్న మహర్ రెజిమెంట్‌కు చెందిన సైనికులు మంచులో కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, రెస్క్యూ టీమ్స్ 5 గంటల పాటు కష్టపడి కెప్టెన్‌ను రక్షించాయి. ప్రాణాలు కోల్పోయిన సైనికులు గుజరాత్, యూపీ, ఝార్ఖండ్‌కు చెందిన వారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సియాచిన్ సముద్రమట్టానికి 12వేల అడుగుల ఎత్తులో ఉంటుంది.

News September 9, 2025

నేపాల్ తదుపరి PM.. ట్రెండింగ్‌లో బాలేంద్ర షా!

image

ఓలీ <<17657494>>రాజీనామాతో<<>> నేపాల్‌ తదుపరి PM ఎవరన్న చర్చ మొదలైంది. కాఠ్‌మాండూ మేయర్ బాలేంద్ర షా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సివిల్ ఇంజినీర్, ర్యాపర్ అయిన షా 2022లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి మేయర్ అయ్యారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూ SMలో యాక్టివ్‌గా ఉండే షాకు యువత మద్దతు ఉంది. ఆయన PMగా బాధ్యతలు చేపట్టాలని ఆన్‌లైన్ క్యాంపెయిన్ కూడా మొదలైంది. కాగా కేవలం కాఠ్‌మాండూలోనే 18 మంది ఆందోళనకారులు మరణించారు.

News September 9, 2025

భరించలేకపోతున్నా.. నాకింత విషం ఇవ్వండి: దర్శన్

image

కొన్ని రోజులుగా జైలులో సూర్యరశ్మి తాకట్లేదని కన్నడ హీరో దర్శన్ కోర్టుకు తెలిపారు. తాను ఫంగస్‌తో బాధపడుతున్నానని, తన దుస్తులు స్మెల్ వస్తున్నాయని వాపోయారు. బయటకు వెళ్లేందుకు అనుమతివ్వాలని లేదా విషం ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణను సెషన్స్ కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. బయట ఉంటే కేసును ప్రభావితం చేస్తారని గత నెలలో <<17401764>>దర్శన్<<>> బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.