News June 4, 2024

Stock Market: రూ.21 లక్షల కోట్ల సంపద ఆవిరి

image

ఎన్నికల ఫలితాల రోజున స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. సూచీల ఘోర పతనంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. నేడు ఒక్కరోజే ఏకంగా రూ.21 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. దాంతో బీఎస్ఈ మార్కెట్ విలువ రూ.404.42 లక్షల కోట్లకు తగ్గింది. ఇక పదేళ్ల బాండ్ ఈల్డు 10 బేసిస్ పాయింట్ల మేర పెరిగి 7.04 శాతానికి చేరింది. ప్రస్తుతం ఇన్వెస్టర్లు ఏం చేయాలో తెలియక దిగాలు పడుతున్నారు.

Similar News

News October 7, 2024

పాత ఉద్యోగికి రూ.23వేల కోట్ల ఆఫర్ ఇచ్చిన గూగుల్

image

ఓల్డ్ ఎంప్లాయీని తిరిగి తీసుకొచ్చేందుకు గూగుల్ ఇచ్చిన ఆఫర్ చర్చనీయాంశంగా మారింది. AI ఎక్స్‌పర్ట్ నోవమ్ షాజీర్‌కు ఏకంగా రూ.23000 కోట్లు ఆఫర్ చేసింది. 2000లో జాయిన్ అయిన నోవమ్ తన MEENA చాట్‌బోట్‌ను మార్కెట్లోకి తీసుకురాలేదని రెండేళ్ల క్రితం వెళ్లిపోయారు. సొంతంగా Character.AIను నెలకొల్పారు. అది ఆర్థిక కష్టాల్లో పడటంతో గూగుల్ ఈ ఆఫర్ ఇచ్చింది. తమ AI ప్రాజెక్ట్ జెమినీకి VPని చేసింది.

News October 7, 2024

సింగర్ అద్నాన్ సమీ తల్లి కన్నుమూత

image

ప్రముఖ సింగర్ అద్నాన్ సమీ తల్లి బేగమ్ నౌరీన్ సమీ ఖాన్(77) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘అమ్మ మరణించడం మాకు తీరని లోటు. ఆమె ఒక అద్భుతమైన మహిళ. ఎంతో ప్రేమ, ఆనందాన్ని అందరితోనూ పంచుకునేవారు’ అని రాసుకొచ్చారు. ఈయన హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లోనూ వందలాది సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. పలు చిత్రాలకు మ్యూజిక్ కూడా అందించారు.

News October 7, 2024

విమానంలో అడల్ట్ మూవీ.. షాకైన ప్యాసింజర్స్

image

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి జపాన్‌లోని హనెడాకు వెళుతున్న క్వాంటస్ విమానంలోని అన్ని స్క్రీన్లలో ఒక్కసారిగా అడల్ట్ మూవీ ప్లే అయ్యింది. మూవీ తమ స్క్రీన్లపై ప్రసారం కాగా దాన్ని ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే సాంకేతిక సమస్య వల్ల ఇలా జరిగినట్లు పేర్కొన్న ఎయిర్‌లైన్స్, ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది.