News June 5, 2024
ఒడిశాలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ కసరత్తు
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన బీజేపీ అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు వేగవంతం చేసింది. ఒకటి రెండు రోజుల్లో ఆ పార్టీ సీఎం అభ్యర్థిపై స్పష్టత రానుంది. సీఎం రేసులో జుయల్ ఓరం, ధర్మేంద్ర ప్రదాన్, సంబిత్ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఒడిశాలో BJP 78, BJD 51, కాంగ్రెస్ 14, ఇతరులు 4 చోట్ల గెలిచారు. 21 లోక్సభ స్థానాలకు BJP 20, కాంగ్రెస్ ఒకచోట గెలిచాయి.
Similar News
News October 6, 2024
INDvPAK: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
ఉమెన్స్ టీ20 వరల్డ్కప్లో భాగంగా టీమ్ ఇండియా అమ్మాయిలు నేడు పాకిస్థాన్తో తలపడుతున్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
పాక్: మునీబా అలీ, గుల్ ఫిరోజా, సిద్రా అమీన్, నిదా దార్, అలియా రియాజ్, ఒమైమా సోహైల్, ఫాతిమా సనా, తుబా హసన్, నష్రా సంధు, సయ్యదా అరూబ్ షా, సాదియా ఇక్బాల్
భారత్: మంధాన, షఫాలీ, హర్మన్ప్రీత్, రోడ్రిగ్స్, రిచా, దీప్తి, అరుంధతి, సజన, శ్రేయాంక, శోభన, రేణుక
News October 6, 2024
చంద్రబాబుకు ఇప్పుడు బైబిల్ కావాలి: VSR
AP: సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు మనోగతం’ అంటూ ఓ ట్వీట్ చేశారు. అందులో ‘పవిత్ర రంజాన్, మిలాద్ ఉన్ నబి అయిపోయాయి. పవిత్ర దసరా అయిపోవస్తోంది. పవిత్ర క్రిస్మస్ వస్తుందిగా వేషం మార్చాలి. అర్జెంట్గా బైబిల్ కావాలి. ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్’ అని రాసుకొచ్చారు. బాబువి ఊసరవెల్లి రాజకీయాలు అని ఆయన విమర్శించారు.
News October 6, 2024
ఏపీ టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల
రాష్ట్రంలో జరుగుతున్న టెట్ పరీక్షల ప్రాథమిక ‘కీ’ని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈనెల 3న ప్రారంభమైన పరీక్షలు 21న ముగియనున్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన పరీక్షల కీని వెబ్సైట్లో పెట్టింది. మిగిలిన కీలను పరీక్షల తర్వాతి రోజున రిలీజ్ చేయనుంది. మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు టెట్కు అప్లై చేశారు. ఫైనల్ కీని అక్టోబర్ 27న, నవంబర్ 2న ఫలితాలు విడుదల చేస్తారు.
వెబ్సైట్: <