News June 11, 2024

లాహోర్‌లో ఆడండి.. భారత్‌కు PCB విన్నపం

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్ వేదికగా భారత్ తమ అన్ని మ్యాచ్‌లు ఆడాలని PCB కోరింది. ఈ మైదానాన్ని హోంగ్రౌండ్‌గా చేసుకుని ఆడాలని విజ్ఞప్తి చేసింది. ఆ జట్టుకు ఇక్కడ పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. పాక్ వినతిపై BCCI ఇంకా స్పందించనట్లు తెలుస్తోంది. వచ్చే ఫిబ్రవరి నుంచి ఈ ట్రోఫీ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ టోర్నీలో జరిగే మ్యాచ్‌లన్నింటినీ దుబాయ్‌లో ఆడాలని భారత్ భావిస్తోంది.

Similar News

News September 11, 2025

పలు జిల్లాల కలెక్టర్లు బదిలీలు

image

AP: రాష్ట్ర ప్రభుత్వం 12జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. ఆయా జిల్లాలకు బదిలీ అయిన కలెక్టర్ల వివరాలు..
* మన్యం- ప్రభాకర్ రెడ్డి, * విజయనగరం- రామసుందర్ రెడ్డి
* తూ.గో.- కీర్తి చేకూరు, * గుంటూరు- తమీమ్ అన్సారియా
* పల్నాడు- కృతిక శుక్లా, * బాపట్ల- వినోద్ కుమార్
* ప్రకాశం- రాజాబాబు, * నెల్లూరు- హిమాన్షు శుక్లా
* అన్నమయ్య- నిషాంత్ కుమార్, * కర్నూలు- ఎ.సిరి
* అనంతపురం- ఆనంద్, * సత్యసాయి- శ్యామ్ ప్రసాద్

News September 11, 2025

భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోలు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని గరియాబాద్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. చనిపోయిన వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ ఉన్నట్లు సమాచారం. అటు మావోల కోసం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది.

News September 11, 2025

కవితకు చింతమడక వాసుల ఆహ్వానం

image

TG: BRS అధినేత KCR స్వగ్రామమైన సిద్దిపేట(D) చింతమడక గ్రామస్థులు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను కలిశారు. HYD బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయానికి వచ్చి ఈనెల 21న ఎంగిలిపూల బతుకమ్మకు రావాలని ఆహ్వానించారు. ‘గొప్ప ఉద్యమకారుడిని కన్న ఊరు మా చింతమడక. పెద్ద సంఖ్యలో వచ్చి నన్ను బతుకమ్మకు ఆహ్వానించడం సంతోషంగా ఉంది. ఈ సమయంలో మీరంతా వచ్చి నాకు ఇచ్చింది మామూలు ధైర్యం కాదు’ అని కవిత అన్నారు.