News June 11, 2024
నేపాల్ క్రికెటర్కు విండీస్ గుడ్ న్యూస్

నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచానేకు వెస్టిండీస్ శుభవార్త చెప్పింది. తమ ప్రాంతంలో నేపాల్ ఆడే మ్యాచుల్లో సందీప్ పాల్గొనవచ్చని విండీస్ ప్రకటించింది. దీంతో నేపాల్ ఆడబోయే చివరి రెండు మ్యాచుల్లో ఆయన బరిలోకి దిగనున్నారు. కాగా తొలుత ఎంపిక చేసిన నేపాల్ జట్టులో సందీప్కు చోటు దక్కింది. కానీ అత్యాచార ఆరోపణలు ఉన్నాయన్న కారణంతో ఆయనకు USA వీసా నిరాకరించింది. దీంతో నేపాల్ ఆడిన తొలి మ్యాచులో ఆయన పాల్గొనలేదు.
Similar News
News September 11, 2025
ఆ ప్రచారాన్ని ఖండించిన మాస్టర్ బ్లాస్టర్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ BCCI తదుపరి ప్రెసిడెంట్ కాబోతున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ ప్రచారానికి తాజాగా సచిన్ తెరదించారు. ఆయనకు చెందిన SRT స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘సచిన్కు సంబంధించి పలు రిపోర్ట్స్, రూమర్స్ మా దృష్టికి వచ్చాయి. అవన్నీ అవాస్తవాలు. ఊహాగానాలను ప్రచారం చేయొద్దని కోరుతున్నాం’ అని పేర్కొంది.
News September 11, 2025
రేపు Way2News కాన్క్లేవ్కు సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు రేపు విజయవాడలో నిర్వహించే Way2News కాన్క్లేవ్కు హాజరు కానున్నారు. ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానికి ఆయన ఇప్పటికే ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆ కార్యక్రమం ముగించుకొని మ. 3గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా కాన్క్లేవ్కు రానున్నారు. రాష్ట్ర అభివృద్ధికి రానున్న దశాబ్ద కాలంలో అవలంబించాల్సిన విధివిధానాల గురించి చర్చించనున్నారు.
News September 11, 2025
ఉత్తరాఖండ్కు రూ.1200 కోట్ల ఆర్థిక సాయం

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్కు ప్రధాని మోదీ రూ.1200 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇవాళ డెహ్రాడూన్ వెళ్లిన ప్రధాని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. అంతకుముందు పంజాబ్కు రూ.1600 కోట్లు, హిమాచల్ప్రదేశ్కు రూ.1500 కోట్లు ప్రకటించారు.